కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేల మంది మృత్యువాత పడ్డారు. లక్షన్నరకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు సహా వివిధ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ను ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కంపెనీలు ఇప్పుడు దీనినే అమలు చేస్తున్నాయి.

ఇంటి నుండే పని చేయండి
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేసే లక్ష్యంలో భాగంగా కంపెనీలు వర్క్ ప్రమ్ హోమ్ ఇస్తున్నాయి. వీలైనంత మందిని ఇంటి వద్ద నుండే పని చేయాలని ఆదేశించాయి. యాక్సిస్ బ్యాంకు, డచ్ బ్యాంకు, జపాన్కు చెందిన MUFG తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయాలని ఆదేశించాయి.

విదేశాలకు నో..
యాక్సిస్, డచ్ బ్యాంకులు అత్యవసర పరిస్థితుల్లో బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్-BCP)ని అమలు చేస్తోంది. ప్రధాన కార్యాలయంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరిని ఇంటి వద్ద నుండి పని చేయాలని కోరింది. ఇక, విదేశాల్లో ఎవరు కూడా పర్యటించవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

దగ్గర్లోని బ్రాంచీకి వెళ్లి బ్యాంకు సిస్టంకు అనుసంధానం కావొచ్చు
గురువారం నుండి తాము BCPని అమలు చేస్తున్నామని, మూడింట రెండొంతుల ఉద్యోగులను ఆఫీస్లోకి అనుమతించడం లేదని అన్ని విభాగాలకు తెలియజేశామని, వారు ఇంటి వద్ద నుండి పని చేయవచ్చునని యాక్సిస్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. బ్యాంకు సిస్టంకు అనుసంధానం కావాలంటే దగ్గరలోని శాఖకు వెళ్తే సరిపోతుందన్నారు. అంతేకాదు, 16వ తేదీ నుండి కేవలం 10 శాతం ఉద్యోగులతో పని చేయించే అంశాన్ని పరిశీలిస్తోంది.

అన్ని బ్యాంకులు అదే దారిలో...
ముంబైలోని పలు ప్రాంతాల్లో తాము BCPని ప్రారంభించామని, తప్పనిసరైన ఉద్యోగులు మాత్రమే కార్యాలయాల్లో పని చేస్తారని, మిగతా వారు ఇంటి వద్ద నుండి పని చేస్తారని డచ్ బ్యాంకు ప్రతినిధులు చెబుతున్నారు. ఇదే విధానం ద్వారా పని చేయించాలని సిటీ బ్యాంకు భావిస్తోంది. త్వరలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనుంది. భారత్ సహా అన్ని దేశాల్లోని సిటీ బ్యాంకు ఉద్యోగులు ఇంటి వద్ద నుండి పని చేసేలా ఆదేశాలు రావొచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications