భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. కరోనా అనంతరం ఎన్పీఏలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి బ్యాడ్ బ్యాంక్ ఐడియా అమలుపై వేగవంతంగా పని చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక రికవరీ కోసం భారత్ చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. తుమ్మల కిషోర్ రచించిన మాంద్యం ముంగిట దేశం అనే పుస్తకానికి దువ్వూరి సుబ్బారావు ముందుమాట రాసారు.

కరోనాకు ముందే ఆర్థిక కష్టాలు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, శక్తివంతమైన ఫెడరలిజం, భారీ వినియోగం ఈ మూడు భారత్కు సానుకూలతలు అని సుబ్బారావు అన్నారు. కరోనా, లాక్డౌన్ వల్ల చరిత్రలోనే కనివిని ఎరుగని తిరోగమనాన్ని భారత్ నమోదు చేసింది. ఈ అంశాన్ని సృశిస్తూ సుబ్బారావు ముందుమాట రాశారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ది పథంలోకి తీసుకురావడం, త్వరిత వృద్ధి ఫలాలు అల్పాదాయ గృహాలకు కూడా విస్తరించేలా సమ్మిళిత వృద్ధిని సాధించడం రాబోయే కాలంలో ప్రభుత్వం ముందున్న సవాళ్లు కరోనా కన్నా ముందే వాస్తవానికి ఆర్థిక వ్యవస్థల్లో కష్టాల్లో ఉందని తెలిపారు.

వీ షేప్ కనిపిస్తోంది కానీ
ఇప్పుడు వీ షేప్ రికవరీ కనిపిస్తోందని చెబుతున్నారని, కానీ ఉత్పాదకత స్థాయిలు కూడా అదే రీతిలో పెరిగాయని అర్ధం కాదన్నారు. 2021-22లో ఉత్పత్తి స్థాయిలు 2019-20 నాటి కన్నా తక్కువ స్థాయిలోనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిధి విస్తరణ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న వారికి జీవం కల్పించిందని, అలాగే మహిళలు, పెన్షన్దారులు రైతులకు ముందస్తు నగదు బదిలీ వంటి అంశాలు డిమాండ్ పుంజుకోవడానికి దోహదపడిందన్నారు. ఎఫ్సీఐ కొనుగోళ్లు పెంచడంతో రైతుల ఆదాయాలు పెరిగాయన్నారు. జీఎస్టీ పరిహారం విషయంలో ప్రభుత్వాల మధ్య విబేధాలు ఉన్నప్పటికీ అందుకు అతీతంగా కరోనా నిర్మూలనకు అందరూ చేసిన సంఘటిత కృషి ఫెడరలిజం అన్నారు.

కొద్ది నెలలు సవాల్
రానున్న కొన్ని నెలలు, సంవత్సరాలు ప్రభుత్వానికి సవాల్ అన్నారు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు వృద్ధి ప్రతిఫలం అందేలా చూడాలన్నారు. ఉపాధి హామీ పథకం వల్ల చాలామందికి జీవనోపాధి లభించిందన్నారు. 135 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో తలసరి ఆదాయం కేవలం 2000 డాలర్లేనని, కాబట్టి ఆదాయం ఏమాత్రం పెరిగినా వినియోగంలోకి మారుతుందని చెప్పారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications