కరోనా మహమ్మారిపై పోరుకు అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్, విప్రో భారీ విరాళాన్ని అందిస్తోంది. రిలయన్స్, టాటా గ్రూప్, అదానీ గ్రూప్, వేదాంత ఇలా ఎన్నో కార్పోరేట్ సంస్థలు ఈ వైరస్ పైన పోరుకు వందలు, వేల కోట్లు ఇస్తున్నారు. బుధవారం మహమ్మారిపై పోరుకు విప్రో, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్, విప్రో ఎంటర్ప్రైజెస్ ప్రకటన చేశాయి. రూ.1,125 కోట్లను ప్రకటించింది.

రూ.1,125 కోట్లు..
కరోనాపై పోరుకు అజీమ్ ప్రేమ్జీ రూ.1125 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందులో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా రూ.1000 కోట్లు, విప్రో లిమిటెడ్ ద్వారా రూ.100 కోట్లు, విప్రో ఎంటర్ ప్రైజెస్ ద్వారా రూ.25 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. విప్రో ప్రతి సంవత్సరం CSR ఫండ్ కింద కేటాయించే మొత్తం కాకుండా అదనంగా ఈ విరాళాన్ని ఇచ్చారు.

కష్టకాలంలో..
కరోనా వైరస్ పైన భారత్ చేస్తోన్న పోరుకు ఈ నిధుల ద్వారా మద్దతు లభిస్తోందని భావిస్తున్నట్లు విప్రో అభిప్రాయపడింది. ముఖ్యంగా కష్టకాలంలో వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. పరిస్థితులు దయనీయంగా ఉన్న ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది.

ఇన్పోసిస్ వైద్య సేవలు కూడా..
కరోనాపై పోరుకు రతన్ టాటా గ్రూప్ రూ.1,500 కోట్లు అందించింది. ఇన్ఫోసిస్ రూ.100 కోట్లు ఇచ్చింది. అంతేకాదు, నారాయణ హెల్త్తో కలిసి బెంగళూరులో 100 మంది పేషెంట్లకు నిర్బంద వైద్య సదుపాయాలు అందిస్తామని తెలిపింది ఇన్ఫోసిస్. సమాజంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న రోగులకు ఇందులో చికిత్స అందిస్తుంటారని, డాక్టర్లు, నర్సుల ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉంటుందని, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications