అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. విలీనం సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేందుకు ఏపీ కేబినెట్ ఈ నెల 11వ తేదీన ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రక్రియకు సంబంధించి కొత్త చట్టాన్ని సోమవారం లేదా మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. దీనికి ముందే ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం వరాలు ప్రకటించింది.

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
ఆర్టీసీ కార్మికులు చాలాకాలంగా వేచి చూస్తున్న 40 శాతం వేతన సవరణ బకాయిలు చెల్లించేందుకు ఉత్తర్వులు ఇదివరకు జారీ చేసింది. తాజాగా, పెండింగులోని రూ.210 కోట్ల బకాయిలను విడుదల చేసింది. కారుణ్య నియామకాలకు ఆర్టీసీ యాజమాన్యం పచ్చజెండా ఊపింది. దీంతో గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి ఊరట లభించినట్లయింది. అలాగే కండక్టర్ల అభ్యర్థుల ఎత్తును 153 సెంటీ మీటర్ల నుంచి 145 సెంటీ మీటర్లకు తగ్గిస్తూ నిబంధనలు సవరించారు.

వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత ఇస్తారు?
ఇదిలా ఉండగా, విలీన ప్రక్రియకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకు వస్తున్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఆదాయంలో ప్రభుత్వానికి వచ్చే వాటాపై ఆర్థిక శాఖ అప్పుడే దృష్టి సారించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల బస్సు ఛార్జీల ధరలు కూడా పెంచారు. ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కేందుకు సమయం తీసుకుంటుంది. సభలో విలీనానికి ఆమోదం లభించిన అనంతరం కార్మికుల జీతభత్యాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత ఇస్తారనే అంశంపై దృష్టి సారించింది.

ఆ నిధులకే రెండు మూడేళ్లు
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక జీతాల చెల్లింపును ప్రభుత్వం చేస్తుంది. దీంతో ఆర్టీసీపై రూ.3,300 కోట్ల మేర భారం తగ్గనుందని ఆర్థిక శాఖ భావిస్తోంది. అందుకే ఆదాయంలో కొంత తమకు ఇవ్వాలని కోరుతోంది. గత నాలుగేళ్లలో డీజిల్ ధరల పెరుగుదల, ఇతర ఖర్చుల వల్ల రూ.6,735 కోట్ల నష్టంతో పాటు బ్యాంకు రుణాలు రూ.2,995 కోట్లు, కార్మికుల ఈపీఎఫ్ ట్రస్ట్ ఫండ్, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి జమ కావాల్సిన మొత్తం, కార్మికులకు చెల్లించే ఇతర బకాయిలు కలిపి రూ.3,740 కోట్ల వరకు చెల్లించాలి. వీటిని చెల్లించిన తరవాత మిగిలిన దానిపై ప్రభుత్వానికి ఇచ్చే ఆలోచనలో ఏపీఎస్ఆర్టీసీ ఉంది. దీనికి రెండు మూడేళ్ల సమయం పట్టవచ్చునని అంచనా.

30 శాతం ఆదాయం ఇచ్చే ఛాన్స్
ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో 30 శాతం ఇచ్చే అంశంపై ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్థిక శాఖ మరింత ఎక్కువ కోరుతోందట. ఛార్జీలు, పార్సిల్ సర్వీసులు, స్థలాలు, దుకాణాలకు వచ్చే అద్దెలు వంటివి కలిపి ఏడాదికి రూ.6 వేల కోట్లకు పైగా రాబడి ఉండగా, కార్మికుల వేతనాలు, డీజిల్ ఖర్చు, బస్సుల నిర్వహణకు రూ.7200 అవుతోంది. అంటే ఏడాదికిరూ.1200 కోట్లు నష్టం వస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications