అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాజధానిపై శుక్రవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి, నిర్ణం తీసుకునే అవకాశముంది. మూడు రాజధానులు అని సీఎం జగన్ ప్రకటించారు. విశాఖ పరిపాలనా రాజధాని అని ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రకటించారు. అయితే రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని 29 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. విపక్షాలు కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. రియాల్టర్లు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ నిర్ణయంపై అమరావతివాసులు, ఏపీవాసులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

మూడు రాజధానులకు నో...
రియాల్టర్లు, బిల్డర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ప్రతినిధులు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే, రాజధానిని లేదా పరిపాలనా కేంద్రాన్ని అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలించాలనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఇదివరకే క్రెడాయ్ ప్రతినిధులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసారు. మూడు రాజదానులు సరికాదని, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు. రాజధాని మార్పుపై అమరావతివాసులతో పాటు రియాల్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ డెవలప్ చేసిన లేదా చేస్తున్న వాటికి డిమాండ్ లేకుండా పోతుంది. ఇప్పటికే వైసీపీ ప్రకటన ద్వారా అమరావతిలో డిమాండ్ తగ్గి, విశాఖకు పెరిగిందని చెబుతున్నారు.

ఆందోళనలపై ముందే హెచ్చరిక
రాజధాని వికేంద్రీకరణ ప్రకటన వల్ల ప్రజలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, రాయలసీమ నుంచి పనుల కోసం విశాఖ వెళ్లాలంటే సాధ్యమయ్యే పనికాదని, లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రంలో ఇటువంటి ప్రయోగాలు మంచిది కాదని కూడా క్రెడాయ్ ప్రతినిధులు ఇదివరకే అన్నారు. జగన్ ప్రకటన వల్ల మూడు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగే అవకాశముందని ముందే హెచ్చరించారు.

సగం నిర్మాణాలు పూర్తయ్యాయి...
అంతేకాదు, రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదికకు ముందే ప్రకటన చేశారు. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే జగన్ తయారు చేసిన రిపోర్టును జీఎన్ రావు నివేదిక పేరుతో తీసుకు వచ్చారని అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము సహకరిస్తామని, ఇప్పటికే సగం నిర్మాణాలు పూర్తి చేసుకు్నన అమరావతిని రాజధానిగా ఉంచి వనరులు, వసతులు కల్పించాలని క్రెడాయ్ ప్రతినిధులు కోరారు.

వీరంతా వ్యతిరేకం...
రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI)తో పాటు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సెల్ (NAREDCO), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI), విజయవాడ నోటిఫైడ్ మున్సిపల్ కార్పోరేషన్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ-IALA), బిల్డింగ్ అండ్ కన్స్టక్షన్ వర్కకర్స్ అసోసియేషన్, హోల్ సేల్ మర్చంట్ కూడా దీనిని వ్యతిరేకించాయి. ఇవన్నీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి నిరసనలు తెలియజేసేందుకు వారం క్రితమే నిర్ణయించాయి.

మరో ప్రభుత్వం మరోసారి మారిస్తే..
గత ప్రభుత్వం రాజధానిగా నిర్ణయించిన అమరావతిని, మార్చడం వంటి నిర్ణయాలు సరికాదని క్రెడాయ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి ధోరణి సాగితే రేపు ఏర్పడే మరో ప్రభుత్వం మరోచోటుకు తీసుకు వెళ్తుందని, అంతిమంగా ప్రజలు నష్టపోతారని చెబుతున్నారు. రాజధాని మార్పు నిర్ణయం వల్ల రాష్ట్రంపై భారీ బర్డెన్ పడుతుందని చెప్పారు. వేతనాలు కూడా సరిగా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడతాయన్నారు.
More From GoodReturns

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications