ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గురువారం (మే 20)వ తేదీన ప్రారంభమయ్యాయి. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రవేశపెడుతోన్న బడ్జెట్ ఇది. బడ్జెట్ ప్రతిపాదనలపై ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హిచందన్ వర్చవల్గా ప్రసంగించారు. ఆయన రాజ్ భవన్ నుండి తన ప్రసంగాన్ని అందించారు. కరోనా బారినపడి విగతజీవులైన వారికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కరోనా తీవ్రత బాగా ఉందని, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీని కరోనా చికిత్సలో చేర్చినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీకి ప్రయివేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ను కేటాయించినట్లు తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్పై ఆయన ప్రశంసలు కురిపించారు. కరోనాతో ఆర్థిక రంగంపై మరోసారి ప్రభావం పడిందని అయినా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదన్నారు.

2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్ ఉండగా, ఆంధ్రప్రదేశ్ 1.58 శాతం అభివృద్ధి రేటు కనబరిచిందని, రాష్ట్రంలో 53.28 లక్షల మందికి కరోనా మొదటి డోస్ ఇచ్చినట్లు చెప్పారు. 21.64 లక్షల మందికి రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తయ్యిందన్నారు. పరిశ్రమల్లో 75 శాతం మంది స్థానికులకు ఉద్యోగాలు లభించేలా చట్టం చేశామని, ఒక స్కిల్ వర్శిటీతో పాటు 25 మల్టీ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
కాగా, మొదటిసారి జెండర్ ఆధారిత బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ అందుకు తగినట్లు కేటాయింపులు చేసిన జెండర్ బేస్డ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రానుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉపప్రణాళికలు పొందుపరిచిన 2021-22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు.
ప్రభుత్వం మార్చి 28వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలకు గాను రూ.70,983 కోట్లతో వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఈ బడ్జెట్ను ఉపయోగించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.2.25 లక్షల కోట్ల నుండి రూ.2.30 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications