చైనా-ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ భారతదేశంలో పెట్టుబడుల విషయంలో మరికొంత కాలం వేచి చూడాలని భావిస్తుంది . భారతదేశం-చైనా ఉద్రిక్తత కారణంగా కొంతకాలంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం పై పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం. భారతదేశంలో చైనా పెట్టుబడులపై ఆంక్షలు , భద్రతా ఆరోపణల కారణంగా అలీబాబా గ్రూప్ రాబోయే ఆరు నెలల వరకు భారతీయ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం లేదని తెలుస్తుంది.

ఇండియాలో పెట్టుబడుల విషయంలో అలీబాబా వెనకడుగు
ఈ విషయంలో అలీబాబా గ్రూప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చైనా సంస్థలపై, చైనా పెట్టుబడులపై భారత ప్రభుత్వం ఇండియా చైనా ఘ్రషణల నేపధ్యంలో కఠిన ఆంక్షలను విధిస్తోంది . బహుశా ఈ దృష్ట్యా, చైనా యొక్క ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అలీబాబా ప్రస్తుతానికి భారతదేశంలో తన పెట్టుబడి ప్రణాళికను నిలిపివేసింది. అలీబాబా గ్రూప్ యొక్క నిర్ణయం భారతదేశంలోని అలీబాబా పెట్టుబడులు పెట్టబోయే సంస్థలతో పాటు అనేక భారతీయ స్టార్టప్లను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది .

ఇప్పటికే ఇండియాలో పెట్టుబడులు పెట్టిన అలీబాబా
ఇప్పటికే పేటీఎం, రెస్టారెంట్ అగ్రిగేటర్ మరియు ఫుడ్ డెలివరీ సర్వీస్ జోమాటో మరియు ఈ కిరాణా బిగ్ బాస్కెట్ లలో అలీబాబా పెట్టుబడులు ఉన్నాయి . అయితే, ఆ పెట్టుబడుల నుండి నిష్క్రమించే ఆలోచన లేదు కానీ కొత్త పెట్టుబడులు పెట్టటానికి మాత్రం పునరాలోచిస్తుంది . చైనా సంస్థ అలీబాబా మరియు దాని అనుబంధ సంస్థలైన అలీబాబా క్యాపిటల్ పార్ట్నర్స్ మరియు యాంట్ గ్రూప్ 2015 నుండి 2 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ .15,000 కోట్లు) భారతీయ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయి.

ఇండియాలో సుమారు రూ. 14,000 కోట్లు పెట్టుబడి పెట్టిన అలీబాబా
మార్కెట్ ఫైనాన్సింగ్ను పర్యవేక్షించే సంస్థ పిచ్బుక్ ప్రకారం, అలీబాబా గ్రూప్ భారతదేశంలో 81.8 బిలియన్ (సుమారు రూ. 14,000 కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు చైనా నుండి వస్తున్న పెట్టుబడులను ప్రభుత్వం కఠినతరం చేస్తున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం .దేశంలోస్టార్టప్ పరిశ్రమలను స్థాపించాలని అలీబాబా కంపెనీ గతంలో భావించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు నెలల వరకు వేచిచూడాలని అలీబాబా సంస్థ భావిస్తోందని సమాచారం.

ఇండియా చైనా సరిహద్దుల ఘర్షణ కారణంగా పునరాలోచన
ఇటీవల, ఇండియా చైనా దేశాల మధ్య లద్దాఖ్ లో సరిహద్దు వివాదంలో 20 మంది భారతీయ సైనికులు అమరవీరులయ్యారు. అప్పటి నుండి, చైనాపై వ్యతిరేకత మరియు చైనా వస్తువుల బహిష్కరణ ప్రచారం భారతదేశంలో ట్రెండింగ్లో ఉన్నాయి. అందుకు తగ్గట్టే భారత ప్రభుత్వం కూడా చైనా విషయంలో సీరియస్ గా ఉంది. ఇంకా సరిహద్దు ఘర్షణ కొనసాగుతూ ఉండటం , ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాని పరిస్థితుల్లో అలీబాబా కొత్త పెట్టుబడుల విషయంలో మరో ఆర్నెల్ల కాలం వేచి చూడాలని నిర్ణయం తీసుకుంది.
More From GoodReturns

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

Financial planning: మెడికల్ బిల్లుల భయం పోవాలంటే.. మీ పేరెంట్స్ కోసం ఇప్పుడే ఈ పనులు చేయండి!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications