Gowtham Adani: 5G స్పెక్ట్రమ్ రేసులో గౌతమ్ అదానీ అడుగుపెడుతున్న వార్తలు.. టెలికాం రంగంలో పెను సంచలనాన్ని సృష్టించాయి. దీంతో అదానీ, అంబానీలు నేరుగా పోటీపడతారా అని అందరినీ ఆలోచనకు గురిచేసింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న టెలికాం కంపెనీల గుండెల్లో ఈ వార్త గుబులు రేపింది. నిజానికి.. బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్, టెలికాం స్పెక్ట్రమ్ కోసం పోటీలోకి ప్రవేశించినట్లు జూలై 9న ప్రకటించింది. అయితే దాని ఉద్దేశ్యం వినియోగదారుల మొబిలిటీ స్పేస్లో ఉండదని తెలుస్తోంది.

సొంత వ్యాపార అవసరాల కోసం..
పోర్ట్లు, లాజిస్టిక్స్, పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్తో పాటు వివిధ తయారీ కార్యకలాపాలతో సహా దాని అన్ని కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి ప్రైవేట్ నెట్వర్క్ను నిర్మించడానికి ఓపెన్ బిడ్డింగ్లో 5G స్పెక్ట్రమ్ను ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ స్వంత వ్యాపార అవసరాల కోసం బిడ్డింగ్ లో పాల్గొననున్నట్లు ప్రకటన చేసింది. సూపర్ యాప్లు, ఎడ్జ్ డేటా సెంటర్లు, ఇండస్ట్రీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లకు హై ఫ్రీక్వెన్సీ కనెక్టివిటీ కోసం 5G స్పక్ట్రమ్ కొంటున్నట్లు తెలిపింది. దీని వల్ల అల్ట్రా హై క్వాలిటీ డేటా స్ట్రీమింగ్ సామర్థ్యాల అవసరాలు తీరుతాయని స్పష్టం చేసింది.

పది రెట్ల వేగంతో 5జీ సేవలు..
ఐదవ తరం లేదా అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి 5G టెలికాం సేవలను అందించగల సామర్థ్యం ఉన్నవాటితో సహా జూలై 26న ఎయిర్వేవ్ల వేలంలో పాల్గొనడానికి దరఖాస్తులు జూలై 8న ముగిశాయి. ఇందులో Jio, Airtel, Vodafone Idea సంస్థలు 5G కోసం వేలం ప్రక్రియలో భాగంగా ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నాయి. జూలై 26, 2022న ప్రారంభం కానున్న వేలంలో మొత్తం 72,097.85 MHz స్పెక్ట్రమ్ విలువ కనీసం రూ. 4.30 లక్షల కోట్లు ఉంటుంది. జూలై 26 నుంచి 20 ఏళ్లపాటు హైస్పీడ్ 5జీ టెలికాం స్పెక్ట్రమ్ను వేలం వేయాలనే ప్రతిపాదనకు ఈ ఏడాది జూన్ 15న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో అందుబాటులోకి రానున్న 5G టెలికాం సేవలు.. 4G కంటే 10 రెట్లు ఎక్కువ వేగం కలిగి ఉంటాయి.

ఏఏ రంగాలకు ఉపయోగం..
ఆటోమోటివ్, హెల్త్కేర్, అగ్రికల్చర్, ఎనర్జీ మరియు ఇతర రంగాలలో మెషిన్ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లకు మెషిన్ను ఎనేబుల్ చేయడానికి ఎంటర్ప్రైజెస్ అండ్ టెక్నాలజీ దిగ్గజాలు తమ సొంత నెట్వర్క్లను కలిగి ఉండే ప్రైవేట్ క్యాప్టివ్ నెట్వర్క్లకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications