Gautam Adani: గౌతమ్ అదానీ ముందుచూపు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని చెప్పుకోవాలి. కేవలం పదేళ్ల కాలంలో దేశంలోనే కాక అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకున్న ఈ బిజినెస్ మ్యాన్ తన బిలియన్ డాలర్ల వ్యూహంలో భాగంగా పెద్ద ప్లాన్ వేశారు. ఈ సారి ఏకంగా లక్ష కోట్లు కుమ్మరించనున్నట్లు ప్రకటించారు కూడా.

వ్యాపార విస్తరణ..
ఐటీ హబ్ గా ఉన్న కర్ణాటకలో తన వ్యాపారాలను విస్తరించాలని అదానీ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే గ్రూప్ ఆ రాష్ట్రంలో దాదాపు రూ.20,000 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. అయితే ఈ సారి మరిన్ని రంగాల్లో పాగా వేయాలని నిర్ణయించింది. అందుకోసం రానున్న 7 సంవత్సరాల్లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇదే విషయాన్ని అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్స్ సీఈవో కరణ్ అదానీ వెల్లడీంచారు.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్..
రెండు రోజుల కిందట కర్ణాటకలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సమయంలో మాట్లాడిన కరణ్ అదానీ తమ విస్తరణ లక్ష్యాల గురించి మాట్లాడారు. ఇందులో భాగంగా సిమెంట్, పవర్, సిటీ పైప్డ్ గ్యాస్, వంట నూనెలు, ట్రాన్స్ పోర్ట్, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెడతామని వెల్లడించారు.

ఐటీ పెట్టుబడులు..
డిజిటల్ హబ్గా మారాలనే మన దేశ ఆలోచనలకు కర్ణాటక ప్రభుత్వం అలైన్మెంట్ చేయడం వల్ల కర్ణాటకలో అపూర్వమైన అభివృద్ధి జరిగిందని కరణ్ అన్నారు. ప్రస్తుతం దేశీయ ఐటీ ఎగుమతుల్లో మూడింట ఒక వంతు అక్కడి నుంచే జరుగుతున్నాయని వాటి విలువ దాదాపుగా 65 బిలియన్ డాలర్లని ఆయన చెప్పుకొచ్చారు.

సోలార్ పవర్..
రానున్న కాలంలో సోలార్ విద్యుత్ రంగంలో కర్ణాటకలో భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుపుతూ.. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సైతం విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇతర వ్యాపారాల వల్ల సైతం ఉపాధి భారీగా పెరుగుతుందని తెలుస్తోంది. ఇదే సమావేశంలో జేఎస్డబ్యూ పవర్ సైతం ఇలాంటి భారీ విస్తరణ ప్రణాళికను వెల్లడించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications