Accenture: ఐటీ కంపెనీలు ఉద్యోగులను అవసరానికి వాడుకుని వదిలేస్తాయని చాలా మంది టెక్కీలు ఆరోపిస్తూనే ఉంటారు. ప్రాజెక్టులు, బూమ్ కొనసాగుతున్నప్పుడు ఎడాపెడా ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే కంపెనీలు వద్దనుకుంటే ఏదో ఒక నెపంతో ఉద్యోగులను తొలగిస్తుంటాయి. ఈ క్రమంలో యాక్సెంచర్ ప్రతినిధి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది.

యాక్సెంచర్ ఎండీ..
భారతదేశంలోని ఐటి కంపెనీలు వినియోగదారులకు మాత్రమే కాకుండా ప్రతిభను సృష్టించాల్సిన అవసరం ఉందని యాక్సెంచర్ ఇన్ ఇండియా చైర్పర్సన్ & ఎండీ రేఖా ఎం. మీనన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రతి వ్యాపారం కేవలం ప్రతిభకు వినియోగించుకుంటం మాత్రమే కాక.. వ్యక్తుల్లోని సామర్థ్యాలను అన్ లాక్ చేయటానికి సృష్టికర్తగా అభివృద్ధి చెందాలని అన్నారు.

భారత ఐటీ..
భారత ఐటీ రంగం దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ సెక్టార్ వైట్ కాలర్ ఉద్యోగాలకు అతిపెద్ద మార్గంగా మారిందన్నారు. ప్రపంచ దేశాలకు ఐటీ సేవలను ఎగుమతి చేయటంలో భారత్ అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ రంగంలో టాలెంట్ లీడర్గా దేశం తన స్థానాన్ని ఎలా కొనసాగించగలదని అడిగినప్పుడు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో నైపుణ్యం కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని మీనన్ పేర్కొన్నారు.

పెట్టుబడులు..
ఐటీ రంగం ప్రస్తుతం మారుతున్న సాంకేతికతల కారణంగా R&Dలో పెట్టుబడులు పెరిగాయి. 2021- 2030 మధ్య సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును 'టేకాడే'ను సూచిస్తుందని మీనన్ అభిప్రాయపడ్డారు. నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి, డిజిటల్ టాలెంట్ భారత్ ఆధిక్యాన్ని కొనసాగించడానికి పెట్టుబడులను కొనసాగించటం చాలా ముఖ్యమని అన్నారు.

డిజిటలీకరణ..
చిట్టచివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలు, ఆరోగ్య సంరక్షణ వంటివి చేరుకునేందుకు కేంద్రం డిజిటల్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. ఆధార్, UPI, కో-విన్, నేషనల్ హెల్త్ స్టాక్ వంటివి విజయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరిన్ని సేవలను డిజిటల్ రూపంలో ప్రజలకు చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం దేశంలో కృషిచేస్తూ ముందుకు సాగుతోంది.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications