Accenture: ఐటీ రంగం పరిస్థితిపై సంచలన రిపోర్ట్ విడుదల చేసిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్ రోజులు గడవక ముందరే ఆకస్మిక నిర్ణయం తీసుకుండి. ఐర్లాండ్ ప్రధాన కార్యాలయం కలిగిన యాక్సెంచర్ నవంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో అట్రిషన్ రేటు బాగా పడిపోయింది. అయితే ఇదెలా సాధ్యమైందని ఇండస్ట్రీలోని వర్గాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

పెరిగిన అమ్మకాలు..
భారత ఐటీ కంపెనీలు ఉద్యోగులను నిలుపుకునేందుకు నానా తంటాలు పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అట్రిషన్ రేటు 13 శాతానికి దిగివచ్చింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 20 శాతంగా ఉంది. ప్రస్తుతం కంపెనీ కింద దాదాపు 737,719 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తక్కువ అట్రిషన్ రేటు కంపెనీ లాభాల మార్జిన్లను పెంచుతుంది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు సైతం 5 శాతం పెరిగి 15.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

తగ్గిన నియామకాలు..
అట్రిషన్ రేటు తగ్గటంతో కంపెనీ కొత్త ఉద్యోగుల నియమించుకోవాల్సిన అవసరం తగ్గింది. ఇది కంపెనీకి రిక్రూటింగ్ ఖర్చులను తగ్గించింది. ఐటి సిబ్బందికి వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, కొత్త సామర్థ్యాల్లో పని చేయడానికి అవకాశాలు కల్పిస్తే ఉద్యోగుల టర్నోవర్ను తగ్గించవచ్చని యాక్సెంచర్ రుజువు చేసింది.

2023 తొలి త్రైమాసికంలో..
కొత్త సంవత్సరం మెుదటి త్రైమాసికంలో కంపెనీకి దాదాపుగా 160 బిలియన్ డాలర్ల విలువైన IT ప్రాజెక్ట్లు పునరుద్ధరించబడతాయి. అయితే ఈ సమయంలో సేవలతో సంతృప్తి చెందని వినియోగదారులు సాధారణంగా ఇతర కంపెనీలకు వాటిని అప్పగించే ప్రమాదం ఉంటుంది. ఇది ఉద్యోగుల తొలగింపుకు కారణమౌతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం వల్ల ఏర్పడిన మాంద్యం ఉండంటంతో కంపెనీలు కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉంటాయని ఐటీ రంగం నిపుణులు చెబుతున్నారు.

ప్రాజెక్టులు కోల్పోతే..
ప్రధానంగా యూరోపియన్ దేశాలు వారి జీడీపీలో 60 శాతం అప్పులు కలిగి ఉన్నాయి. అందుకే అవి మాంద్యం వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్లలో యూరప్ కూడా ఒకటిగా ఉన్నందున.. ఏవైనా కంపెనీలు భారీ సంఖ్యలో ప్రాజెక్టులను కోల్పోతే.. ఐటీ రంగంలో భారీగా తొలగింపులు తప్పవని తెలుస్తోంది. చాలా కంపెనీల్లోని ఉద్యోగులు సైతం ఇప్పుడు దీనిపైనే అధికంగా ఆందోళన చెందుతున్నారు.

ఐటీ కంపెనీల్లో అట్రిషన్..
సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు భారీగానే ఉంది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ ఉద్యోగుల టర్నోవర్ రేటు 27.1 శాతం, విప్రో 23 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 23.8 శాతం, టీసీఎస్ 21.5 శాతం, టెక్ మహీంద్రా 20 శాతం కలిగి ఉన్నాయి. ఇవి కంపెనీలు కోరుకుంటున్న దానికంటే ఎక్కువనే చెప్పుకోవచ్చు.
More From GoodReturns

ఐటీ స్టాక్స్ Q4 ఫలితాలు..TCS, ఇన్ఫోసిస్ నుండి HCL టెక్ వరకు.. షేర్లు కొనుగోలుపై బిగ్ అలర్ట్..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications