IRCTC News: దేశంలో అందరికీ ఇష్టమైనది ఛాయ్. అది లేకుండా చాలా మందికి పనులు ప్రారంభం కావు. సంతోషంగా ఉన్నా, తలనొప్పిగా ఉన్నా, స్టెస్ ఎక్కువైనా ఇలా దేనికైనా టీ ఒక దివ్యఔషధం లాంటిది. కానీ ఐఆర్సీటీసీకి చెందిన కొన్ని రైళ్లలో టీ ధర రూ.20 కానీ సర్వీస్ ఛార్జీ రూ.50. అంటే అంటే టీ ఖరీదు రూ.70. ఫైవ్ స్టార్ హోటల్ లేదా హై-ఫై రెస్టారెంట్లో కాదు ఈ రేట్లు భారతీయ రైల్వేలకు చెందిన శతాబ్ది ఎక్స్ప్రెస్ లో జరిగింది. ఈ సంఘటన గత మంగళవారం నాటిది.
న్యూఢిల్లీ నుంచి భోపాల్ మధ్య నడుస్తున్న భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఇటువంటి రుసుము వసూలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన IRCTC బిల్లులు ప్రస్తుతం నెట్టిల్లో వైరల్ గా మారాయి. అనేక మంది నెటిజన్లు ఈ రేట్లపై భిన్నంగా స్పందిస్తున్నారు.
విషయం ఏంటంటే..
ఢిల్లీలో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు దీపక్ కుమార్ ఝా ఈరోజు రైల్వేకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. అతను తన ట్విట్టర్ ఖాతాలో IRCTCకి సంబంధించిన రెండు క్యాష్మెమోలను పోస్ట్ చేశారు. అందులో రూ. 20 టీపై రూ. 50 సర్వీస్ ఛార్జ్ తో కలిపి మొత్తంగా రూ. 70 వినియోగదారుని నుంచి వసూలు చేసింది.

సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడానికి అనుమతి ఉందా?
ఈ బిల్లులో ఎలాంటి పొరపాటు అధిక చార్జీలు లేవని రైల్వే అధికారులు చెబుతున్నారు. 2018 జూన్లో రైల్వే బోర్డుకు చెందిన టూరిజం అండ్ క్యాటరింగ్ డైరెక్టరేట్ దీనికి సంబంధించిన లేఖను జారీ చేసిందని ఆయన చెబుతున్నారు.
ఒక వ్యక్తి రాజధాని లేదా శతాబ్ది వంటి రైలులో ముందుగానే ఆహారాన్ని బుక్ చేసుకోకపోతే, వాకు ప్రయాణ సమయంలో టీ మొదలైనవి అడిగితే సరఫరా చేయబడుతుంది. అయితే.. ప్రతి మైలుకు ప్రయాణీకుడు అదనంగా రూ.50 సర్వీస్ ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది.

ఆ రైళ్లలోనే ఎందుకలా..
రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వేలో ప్రీమియం రైలుగా పరిగణించబడుతున్నాయి. ఇందులో టిక్కెట్తో పాటు ఆహారం కూడా బుక్ చేస్తారు. ముందుగా టికెట్తో ఫుడ్ బుక్ చేసుకోవడం తప్పనిసరి. ఇప్పటికే డబ్బులు డిపాజిట్ చేసిన రైలు ప్రయాణికులకు తొలి ఆహారం అందజేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే మైళ్లను ఎంపిక చేసుకోని ప్రయాణికులు రైలులో టీ లేదా మైళ్లు తదితరాలను డిమాండ్ చేస్తే, ప్రతి మైలుకు అదనంగా రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రైలు ఆలస్యంగా వస్తుంది. అటువంటి పరిస్థితిలో.. డబ్బు చెల్లించిన ప్రయాణీకులకు అదనపు డబ్బు లేకుండా ఆహారం లభిస్తుంది.
కానీ ఆహారం కోసం చెల్లించని వారు, ఆహారం కోసం ఫిక్స్డ్ ఛార్జీకి అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి ఇలాంటి రైళ్లలో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా అవసరమైతే ఆహారం గురించి ముందుగానే ప్లాన్ చేసుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications