న్యూఢిల్లీ: 2016 నవంబర్ 8వ తేదీన రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ సాగుతోంది. దేశంలో అవినీతికి, అక్రమాలకు పెద్ద నోట్లు కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా అప్పుడు నోట్లు రద్దు చేశారు. ఆ తర్వాత రూ.2000 నోట్లు తీసుకు వచ్చారు. అయితే, ఇప్పుడు ఈ నోటు కూడా ఆగిపోనుందని తెలుస్తోంది. ఇప్పటికే దీని ప్రింటింగ్ నిలిచిపోయినట్లుగా సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది.

నోట్ల రద్దు తర్వాత రూ.2,000 నోటు
మూడేళ్ల క్రితం నోట్లు రద్దు చేసినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో మరింత ఇబ్బందులు ఉండకుండా అప్పటికి రూ.500, రూ.2000 నోటును తీసుకు వచ్చారు. పెద్ద నోట్లకు మోడీ ప్రభుత్వం ముందు నుంచి వ్యతిరేకంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. కానీ నాటి ఇబ్బందులను లెక్కలోకి తీసుకొని తాత్కాలికంగా రూ.2,000 నోటును తీసుకు వచ్చింది. ఇప్పుడు ఈ నోటు ప్రింటింగ్ను ఆపివేసిందట. ప్రస్తుతం ఈ నోట్లు అందరూ ఉపయోగిస్తున్నారు. ఏటీఎంకు వెళ్లి రూ.2000కు మించి డ్రా చేస్తే ఈ పెద్ద నోటు తప్పకుండా వచ్చే పరిస్థితి.

ఒక్క నోటూ ముద్రించలేదు
గత కొద్ది రోజులుగా రూ.2,000 నోటు అంతగా కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని బ్యాంకులు దీనిని ఏటీఎంలలో నింపడం కూడా ఆపివేశాయి. ఇందుకు కారణం ఆర్బీఐ ఈ నోట్ల ముద్రను నిలిపివేయడమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు. సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ ఈ వివరాలు తెలిపింది.

రద్దు కాదు.. ప్రింటింగ్ నిలిపివేత
రూ.2,000 రద్దు కానున్నాయా అనే చర్చ సాగుతోంది. అయితే నోట్ల రద్దుకు, నోట్ల ముద్రణ నిలిపివేయాడనికి తేడా ఉంది. పెద్ద నోట్లకు వ్యతిరేకమైన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నోటు ముద్రణను నిలిపివేసింది. నాడు అవసరార్థం తీసుకువచ్చిన ఈ నోటును ఇప్పుడు ముద్రించడం నిలిపివేశారు. అంతేకాదు, రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి రూ.2000 నోట్లు తీసుకు రావడంపై విపక్షాలు విమర్శలు కూడా గుప్పించాయి. కానీ నాటి పరిస్థితుల్లో అది అవసరం. క్రమంగా దీని ఉపయోగాన్ని తగ్గిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రింటింగ్ నిలిపివేశారు. కానీ రద్దు అనేది ఊహాగానాలేనని చెబుతున్నారు. రూ.2000 నోట్ల ప్రింట్ నిలిపివేయడం ద్వారా విమర్శకులకు కూడా సరైన జవాబు ఇచ్చినట్లుగా అయింది.

నోట్ల ముద్రణ క్రమంగా తగ్గించారు..
నోట్ల రద్దు అనంతరం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ల నోట్లు ముద్రించగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లు ముద్రించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 46.670 మిలియన్లకు ఈ ముద్రనను కుదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2,000 నోటు కూడా ముద్రించలేదు. అధిక విలువ కలిగిన నోట్ల చలామణిని తగ్గించడం ద్వారా నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. 2018 మార్చి నాటికి 3,363 మిలియన్ల రూ.200 నోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications