అనంతపురం/విజయవాడ: కియా మోటార్స్ కంపెనీ తన కొత్త సెల్టోస్ కారును ఈ నెల 8వ తేదీన మార్కెట్లోకి తీసుకు వస్తుంది. ఈ లాంచింగ్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. అనంతపురం జిల్లాలోని పెనుగొండ కియా మోటార్స్ ప్లాంట్ వద్ద ఈ కొత్త కారును లాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కియా ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందించారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు.

కియా కొత్త కారు ప్రారంభోత్సవానికి జగన్
కియా కొత్త కారు ప్రారంభోత్సవానికి జగన్ హాజరు కానున్నారు. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్ పెనుగొండలో రూ.13,500 కోట్ల పెట్టుబడితో 650 ఎకరాల్లో కియా కార్ల ప్లాంట్ను ఏర్పాటు చేసింది. కియాతో ఏపీ ప్రభుత్వం 2017, ఏప్రిల్ 27న ఒప్పందం చేసుకుంది.

చంద్రబాబు హయాంలో ప్రారంభం
ప్లాంట్ నిర్మాణ పనులు 2017 నవంబర్ 15వ తేదీన ప్రారంభించారు. 2018 ఫిబ్రవరి 22న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కియా మోటార్స్ చీఫ్ పార్క్ చేతుల మీదుగా ఫేమ్ ఇన్స్టలేషన్ కార్యక్రమం జరిగింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు కియా కారును ఆవిష్కరించారు. 2019 జనవరి 19న కియా కారులో చంద్రబాబు, కంపెనీ ప్రతినిధులు కాసేపు షికారు చేశారు. కియా తొలి కారును టెస్ట్ ట్రాక్లో చంద్రబాబు నడిపారు.

భవిష్యత్తులో ఉత్పత్తి రెండింతలు..
అనంతపురం జిల్లాలోని పెనుగొండలో ఉన్న కియా మోటార్స్ ప్లాంట్ నుంచి ఏడాదికి 3 లక్ష కార్లు ఉత్పత్తి కానున్నాయి. భవిష్యత్తులో ఏడాదికి ఏడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. ఇక్కడ తయారైన ఇంజిన్లను టర్కీ, స్లొవేకియాకు ఎగుమతి చేస్తున్నట్లు కియా ప్రతినిధులు చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications