ప్రభుత్వ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎగుమతులకు సంబంధించిన సర్వీస్ ఛార్జీలను సవరిస్తున్నట్లు తెలిపింది. ట్రేడర్లకు సంబంధించిన ఎగుమతి లావాదేవీలకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. వ్యాపారం సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఛార్జీలను సవరించిన సమయంలో ఎస్బీఐ వివిధ ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కౌన్సెల్స్ నుంచి వచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించింది.

ఒకేసారి చెల్లించేలా...
ప్రస్తుతం ప్రతి ట్రాన్సాక్షన్కు వివిధ రకాల ఛార్జీలు ఉన్నాయి. దానికి భిన్నంగా ఏడాదికి ఒకసారి చెల్లించే విధంగా ప్రస్తుత విధానాన్ని సవరించారు. ఇది ఎగుమతిదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సవరించిన ఎగుమతిదారులకు ఎంతో సహాయకారిగా ఉంటాయని, అలాగే ఎగుమతులను మెరుగుపరిచేలా ఉంటాయని ఎస్బీఐ ఆశిస్తోంది. సవరించిన చార్జీలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

రెండు కేటగిరీలు..
ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్కు చెందిన సర్వీస్ ఛార్జీలు రెండు కేటగిరీలుగా ఉంటాయి. ఎక్స్పోర్ట్ క్రెడిట్ కస్టమర్స్, నాన్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ కస్టమర్లుగా ఉంటాయి. అలాగే ఎంఎస్ఎంఈ, నాన్ ఎంఎస్ఎంఈ కస్టమర్ల ప్రాతిపదికన ఛార్జీలు ఉంటాయని బ్యాంకు తెలిపింది. ఎగుమతిదారులకు వ్యాపార నిర్వహణ సులభతరం చేయడం, ఖర్చు వివరాలు స్పష్టంగా వారికి తెలియజేయడం వంటి అంశాలు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది.

ఎస్బీఐ..
మార్చి 31, 2019 నాటికి ఎస్బీఐ వద్ద 29 లక్షల కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి. CASA (కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ రేషియో) 22 లక్షల కోట్లతో 45.74 శాతం కలిగి ఉంది. హోమ్, ఆటో లోన్స్లో ఎస్బీఐ వాటా 33 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా బ్యాంకుకు 22,010 బ్రాంచీలు ఉన్నాయి. 58,000కు పైగా ఏటీఎం, సీడీఎం నెట్ వర్క్స్ ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications