అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అంశంపై మంగళవారం ఏపీ అసెంబ్లీలో దుమారం చెలరేగింది. మహిళలందరికీ పెన్షన్ అని జగన్ బహిరంగ సభల్లో చెప్పారని, సాక్షి పత్రికలో వచ్చిందని, కానీ ఇప్పుడు కేవలం నాలుగు దఫాలుగా కుటుంబానికి రూ.75వేలు అని మాత్రమే అంటున్నారని టీడీపీ విమర్శించింది. ఈ లెక్కన ఆయా కుటుంబ సభ్యులకు ఎంత మొత్తం నష్టం జరిగిందో టీడీపీ అధినేత చంద్రబాబు లెక్కలతో సహా చెప్పారు. అయితే, 45 ఏళ్లకు పింఛన్ స్థానంలో వైయస్సార్ చేయూత తీసుకు వచ్చామని జగన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అయిదేళ్లకు రూ.75వేలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అర్హులందరికీ 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, రాష్ట్రమంతా ప్రచారం చేశారని చంద్రబాబు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 సంవత్సరాలు దాటిన మహిళలకు మొత్తంగా రూ.75 వేలు చొప్పున ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారన్నారు.

ఒక్కో మహిళా కుటుంబానికి రూ.1.05 లక్షల నష్టం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 45 ఏళ్లకే నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ ఇస్తే, అయిదేళ్లలో వారికి రూ.1.80 లక్షల ప్రయోజనం చేకూరుతుందన్నారు. కానీ మాత్రం అయిదేళ్లకు రూ.75వేలు ఇస్తామని చెబుతున్నారని, అంటే ఒక్కో మహిళా కుటుంబానికి రూ.1.05 లక్షల నష్టం జరుగుతుందన్నారు.

జగన్ హామీలు 590కి పైగా...
జగన్ పాదయాత్రలో, మేనిఫెస్టోలో, ఇతరత్రా ఇచ్చిన హామీలు 590కి పైగా ఉన్నాయని, వాటిని అమలు చేయాలని అడుగుతున్నామని చంద్రబాబు చెప్పారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో టీడీపీ ప్రభుత్వం బీసీలకు రూ.16,226 కేటాయిస్తే, వైసీపీ ప్రభుత్వం పూర్తి బడ్జెట్లో రూ.15,061కు కుదించిందన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications