ముంబై: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ఆదాయ అంచనాలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 15 శాతం తగ్గేలా ఉన్నాయని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది. గత కొద్ది క్వార్టర్లుగా RIL స్థూల రిఫైనింగ్ మార్జిన్లు ఒత్తిడిలో ఉన్నాయి. ప్రస్తుతం రిఫైనింగ్, పెట్రో రసాయనాలకు ఉన్న ప్రతికూలతల నేపథ్యంలో ఈ అంచనా వేసింది. వీటితో పాటు అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) నిబంధనలు నిరుత్సాహంగా ఉంటే మరింత తగ్గే అవకాశముందని పేర్కొంది. అయితే ధరలు 12 నుంచి 20 శాతం పెంచితే దన్నుగా ఉండొచ్చని భావిస్తున్నారు.

రిలయన్స్ జియో టారిఫ్ పెంచితే.. కానీ
తన కోర్ బిజినెస్ వ్యాపార బలహీనతలు తగ్గించేందుకు, రిలయన్స్ జియో టారిఫ్ 12 శాతం నుంచి 20 శాతం పెంచితే కొంత సానుకూలం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్జిన్ పెరిగితే ప్రతికూలత 9 శాతం తగ్గనుందని పేర్కొంది. అయితే టెలికం ప్రొవైడర్లలో గట్టి పోటీ నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జియో టారిఫ్ పెంచే అవకాశాలు లేవని చెబుతున్నారు. సోమవారం నాడు RIL షేర్లు సెన్సెక్స్, నిఫ్టీలో పడిపోయాయి. జేపీ మోర్గాన్... సెకండ్ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ. ఇది గత కొంతకాలంగా RIL వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత నెలలో మోర్గాన్ స్టాన్లీ కూడా RIL వృద్ధి 2020 ఆర్థిక సంవత్సరంలో సగానికి తగ్గవచ్చునని అంచనా వేసింది. 2017 నుంచి 2019 ఆర్థిక సంవత్సరం వరకు 17 శాతం వృద్ధి కనిపించింది.

GRM కీలకం
రిఫైనింగ్, పెట్రో రసాయనాల మార్జిన్లు తమ అంచనాల కంటే పదిహేను శాతం తగ్గవచ్చునని, ఆయిల్ ధరలు తక్కువగా కావడం కూడా రిలయన్స్ పైన ప్రభావం పడుతుందని జేపీ మోర్గాన్ పేర్కొంది. గ్యాసిఫైర్, ROGC, ఈథాన్ షిప్పింగ్ వంటి కొత్త ప్రాజెక్టుల లాభదాయకతలు ఆయిల్ ధరలతో ముడివడి ఉంటాయన్నారు. గత కొన్ని క్వార్టర్లుగా GRM (గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్) ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. మార్చి క్వార్టర్లో బ్యారెల్ ధర 8.2 డాలర్లుగా ఉంటే, అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 11.1 డాలర్లుగా ఉందని గుర్తు చేసింది. 2014 అక్టోబర్ - డిసెంబర్ పీరియడ్లో బ్యారెల్ 7.3 డాలర్లుగా ఉందని, ఆ తర్వాత కనిష్టస్థాయి ఇప్పుడే (ఈ ఏడాది మార్చి క్వార్టర్)నని పేర్కొంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్
ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ (IMO) రెగ్యులేషన్స్ ప్రకారం షిప్పింగ్ కంపెనీలు జనవరి 2020 వరకల్లా తమ బంకర్ ఇంధనంలో సల్ఫర్ పరిమాణాన్ని 3.5 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గించాలి. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి రిఫైనరీస్కు ఉత్సాహాన్ని ఇచ్చేదే. IMO 2020 నిబంధనలు నిరుత్సాహపరిస్తే మాత్రం ఇది ప్రతిబంధకంగా మారుతుందని పేర్కొంది. 2020 ద్వితీయర్థంలో GRMలు రికవరీ చెందవచ్చుననే అంచనాతో ప్రస్తుతానికి 2020 ఆర్థిక సంవత్సరం అంచనాలు తగ్గించడం లేదని పేర్కొంది. దీంతో పాటు రిలయన్స్ జియో ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (InvIT)కు సంబంధించి పేమెంట్ కమిట్మెంట్స్ అందుబాటులో ఉండవచ్చునని భావిస్తోంది. ఒకవేళ రిలయన్స్... జియో ఫిక్స్డ్ పేమెంట్స్ను కేపిటలైజ్ చేస్తే కనుక ఎర్నింగ్స్ పర్ షేర్ (EPS)పై ప్రభావం ఉండకపోవచ్చునని పేర్కొంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications