గల్లీ గల్లీ ఫినో ... ప్రజల వద్దకే బ్యాంకింగ్ సేవలు
బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు వెళ్లని ప్రజల కోసం బ్యాంకులే వెళుతున్నాయి. ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయంతో ఫినో పేమెంట్స్ బ్యాంక్సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. గల్లీ గల్లీ ఫినో అనే పేరుతో బ్యాంకింగ్ సేవలను ప్రజల వద్దకు తీసుకు వెళుతున్నామని ఫినో పేమెంట్ బ్యాంక్ విక్రయాల విభాగం అధిపతి శైలేష్ పాండే చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా ఫినో పేమెంట్ బ్యాంక్ కు సంబంధించి 400 శాఖలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇంటిని, ఫ్లాట్లను కొనుగోలు చేసినా స్వాధీనం చెయ్యటం లేదా ? అయితే ఇది మీకు ఊరటనిచ్చే వార్త
ఇందులో భాగంగా కిరాణా షాపులు ,స్టేషనరీ మార్ట్ లు, మొబైల్ రిపేర్ కేంద్రాలను బ్యాంకింగ్ పాయింట్స్ గా మార్చుకుంటోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పనులు మానుకొని బ్యాంకులకు వెళ్లలేరని, బ్యాంకింగ్ సేవల కోసం అధిక సమయాన్ని కేటాయించలేరు అని భావిస్తున్న నేపథ్యంలో వారి కోసం వారి దగ్గరికే వెళ్లి తమ బ్యాంకింగ్ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. దీనికి తగ్గట్టుగా మర్చంట్ పాయింట్స్ నెట్వర్క్ ను రూపొందిస్తున్నామని , అన్ని వేళల్లో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫినో బ్యాంక్ పేర్కొంది.
మైక్రో ఎటిఎం తరహాలో ఈ కేంద్రాల్లో సేవలు పొందవచ్చు అని, ఆధార్ ధృవీకరణతో నగదు లావాదేవీలు చేయవచ్చని సెలవురోజుల్లోనూ పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో 8000 మర్చంట్ పాయింట్స్ నెలకొల్పినట్లు గా పేర్కొన్నారు .కేవలం హైదరాబాద్ నగరంలోనే 900 మర్చంట్ పాయింట్స్ ఉన్నట్లుగా తెలిపారు.