భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు, ఏప్రిల్ నాటికి ద్రవ్యోల్భణం 41%
కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. కామర్స్ మినిస్ట్రీ ఇటీవల విడుదల చేసిన ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ (ఆహార ద్రవ్యోల్భణం) ఏప్రిల్ నెలలో 7.4 శాతం పెరిగింది. గత 33 నెలల్లో ఇది అత్యధికం. గత కొద్ది రోజులుగా కూరగాయలు, పంపుదినుసులు, వీట్, మీట్ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. హోల్సేల్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ 2014-15 నుంచి వరుసగా 5.6%, 2.6%, 4%, 2%, 0.4%గా ఉంది. దీనిని చూస్తే ఫుడ్ ప్రైస్ పెద్దగా పెరిగినట్లుగా కూడా ఏమీ కనిపించడం లేదు.
టోకున కూరగాయల బాస్కెట్ ధరలు 2018తో పోల్చితే ఏప్రిల్లో 40.65 శాతం పెరిగాయి. దీనిని బట్టి ఏప్రిల్లో 3.07 శాతంగా ద్రవ్యోల్భణం రేటు నమోదు అయింది. అంతకుముందు ఏడాది కంటే ఈ పెరుగుదల రేటు 3.62 శాతంగా ఉంది. అయితే సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉండే తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గాయి. ఇంధనం ధర కూడా ఏప్రిల్లో పెద్దగా పెరగలేదు. సూచీలో ఫుడ్ ఆర్టికల్స్ వాటా 20 శాతం. 2018 డిసెంబర్లో ఆహార ద్రవ్యోల్భణం 0.42 శాతం క్షీణించింది. అప్పటి నుంచి పెరుగుతోంది. మార్చిలో 28.13 శాతానికి చేరుకుంది. ఇప్పుడు 40.1 శాతంగా ఉంది. అలూ ధరలు మాత్రం 17.15 శాతం తగ్గాయి.
ఇదిలా ఉండగా, ఆర్బీఐ రేపె రేటును మరింత తగ్గించడానికి అనుగుణమైన గణాంకాలు ప్రస్తుతం వస్తున్నాయని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్లో పాలసీ సమీక్ష ఉంది. అప్పుడు ిరటైల్ ద్రవ్యోల్భణాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. టోకు, రిటైల్ ద్రవ్యోల్భణం 4 శాతం దిగువన కొనసాగితే జూన్ ఆర్బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా రేటు తగ్గింపు అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.