ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ అటాక్ ప్రమాద హెచ్చరిక!! ఈ మేరకు క్రెబ్స్ఆన్సెక్యూరిటీ ఫౌండర్ బ్రియాన్ క్రెబ్స్ ఈ మేరకు అలర్ట్ చేశారు. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పు ఉందని ఈ సైబర్సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ వెబ్సైట్ క్రెబ్స్ఆన్సెక్యూరిటీడాట్కామ్ చెబుతోంది. బ్రియాన్ క్రెబ్స్ వాషింగ్టన్ పోస్ట్ మాజీ ఉద్యోగి, సైబర్ సెక్యూరిటీ రైటర్. ఈయన ఆధ్వర్యంలో ఈ వెబ్సైట్ నడుస్తోంది.

విప్రోలాగా ఇన్ఫోసిస్, క్యాప్ జెమినిలు టార్గెట్
ఈ రిపోర్ట్స్ ప్రకారం విప్రోలాగా ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ వంటి పలు ప్రధాన సంస్థలను సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేయాలని చూస్తున్నారు. వీటితో పాటు రిటైల్, ఫైనాన్షియల్, కన్సల్టింగ్ కంపెనీస్ను కూడా అప్రమత్తం చేశారు. సైబర్ అటాకర్స్ గిఫ్ట్ కార్డు రూపంలో ఫ్రాడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నరని బ్రియాన్ క్రెబ్స్ పేర్కొన్నారు. కాగా, తమ ఉద్యోగుల్లో కొందరి ఖాతాలు హ్యాకింగ్కు గురైనట్లు ఇప్పటికే విప్రో అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో క్యాప్జెమినీ సైతం ఇదే తరహా దాడులను గుర్తించామని పేర్కొంది. అదే సమయంలో నివారణ చర్యలు తీసుకున్నామని, దీంతో ఎలాంటి నష్టం లేదని పేర్కొంది.

విప్రో విచారణ
ఉద్యోగుల ఈ-మెయిల్స్, కంప్యూటర్స్ పైన జరిగిన సైబర్ దాడులపై దర్యాప్తు చేస్తున్నామని, ఓ ఫోరెన్సిక్ సంస్థను కూడా నియమించుకుంటున్నామని విప్రో తెలిపింది. విచారణ పూర్తయిందా వెల్లడించలేదు. మరిన్ని దాడులకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని పేర్కొంది. ఇలాంటి సైబర్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, డేటా చోరీకి సంబంధించిన దాఖలాలు ఏవీ లేవని ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ సంస్థలు తెలిపాయి.

విప్రోలో వందకు పైగా..
గత నెల విప్రోలో వందకుపైగా కంప్యూటర్లు, డజన్ల కొద్దీ ఉద్యోగులు సైబర్ దాడులకు గురయ్యారన్న క్రెబ్స్ఆన్సెక్యూరిటీ వార్తలపై స్పందిస్తూ గిఫ్ట్ కార్డ్ మోసంపై దృష్టి సారించామని, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి సైబర్ నేరగాళ్లు ఈ-మెయిల్ స్కామ్కు తెరతీశారని ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ పేర్కొన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications