స్టాక్ మార్కెట్లు సోమవారం ఊగిసలాటలతో ప్రారంభమయ్యాయి. ఉదయం స్వల్ప లాభాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. డాలర్ మారకం విలువతో రూపాయి 69.50 వద్ద ప్రారంభమైంది. ఇది గత వారం 69.23 వద్ద ముగిసింది. ఉదయం గం.9.45 నిమిషాల వద్ద నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 11,645 వద్ద, సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 33,828 వద్ద ట్రేడ్ అయింది. పది గంటల సమయంలో సెన్సెక్స్ 0.09 శాతం పెరిగి 38,896 వద్ద ట్రేడ్ అయింది.
పవర్ గ్రిడ్, భారతి ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్, హెచ్యూఎల్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, రిలయన్స్ క్యాపిటల్, జై కార్పొరేషన్ లిమిటెడ్, వొడాఫోన్ ఐడియా, వేదాంత, టాటా స్టీల్ కంపెనీల షేర్లు కూడా లాభాల్లో కొనసాగాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, ఆర్ఐఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

ఇదిలా ఉండగా, వొడాఫోన్ ఐడియా రైట్స్ ఇష్యూలో విదేశీ మదుపర్లు రూ.18,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశముందని, ఇందులోనూ ప్రధానంగా వొడాఫోన్ గ్రూప్ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టబోతోందని వార్తలు వస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు రైట్స్ ఇష్యూ ప్రకటించింది. ఇది బుధవారం ప్రారంభం కానుంది. ఎఫ్డీఐలకు అనుమతివ్వాలని వొడాఫోన్ ఐడియా ప్రభుత్వాన్ని కోరింది. దీనికి కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది.
ఈ రైట్స్ ఇష్యూ ద్వారా రూ.18,000 కోట్ల నిధులు విదేశీ మదుపర్ల నుంచి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ఏ సంస్థ అయినా రూ.5000 కోట్ల కంటే ఎక్కువ విదేశీ నిధులు సమీకరించాలనుకుంటే ప్రభుత్వం ఆమోదం అవసరం. ఇందులోని ప్రమోటర్లు వొడాఫోన్ గ్రూప్ రూ.11,000 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.7,250 కోట్లు రైట్స్ ఇష్యూలో పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఈక్విటీ షేరును రూ.12.50 చొప్పున రైట్స్ ఇష్యూ ద్వారా జారీ చేయాలని పదిహేను రోజుల క్రితం నిర్ణయించారు. ఇది మార్కెట్ ధరకు 61 శాతం తక్కువ.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications