డిల్లి -ఆగ్రా టోల్ రోడ్డును అమ్మేస్తున్నాం...
అప్పుల నుండి బయటపడేందుకు అనిల్ అంబాని గ్రూప్ లోని ఒక్కోక్క వ్యాపారాన్ని అమ్మేస్తున్నారు..ఈనేపథ్యంలోనే తాజగా ఢిల్లి -ఆగ్రా టోల్ రోడ్డును అమ్మివేయడానికి నిర్ణయించారు...
సన్ షైన్ ఆసుపత్రి వాటాలను కోనుగోలు చేయనున్న కిమ్స్
ఢిల్లి -ఆగ్రా రోడ్డు అమ్మివేయనున్న రిలయన్స్ ఇన్ ఫ్రా
అప్పుల నుండి బయటపడేందుకు అనిల్ అంబాని గ్రూప్ లోని ఒక్కోక్క వ్యాపారాన్ని అమ్మేస్తున్నారు..ఈనేపథ్యంలోనే తాజగా ఢిల్లి -ఆగ్రా టోల్ రోడ్డును అమ్మివేయడానికి నిర్ణయించారు...కాగా దీన్ని రిలయన్స్ మొత్తం వాటాను రూ. 3600 కోట్లకు కొనుగోలు చేసేందుకు సింగపూర్ కు చెందిన క్యూబ్ హైవేస్ తో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది.కాగా వచ్చిన వాటా ధనంతో తన అప్పులను తీర్చాలనుకుంటోంది రిలయన్స్ ఇన్ ఫ్రా,దీంతో రిలయన్స్ కు ఉన్న అప్పుల్లో 25 శాతం తగ్గి, ఇంకా 5000 కోట్ల రుణాల భారానికి చేరుకోనుంది.
ఎందుకు అమ్మాలనుకుంటుంది..
అయితే లాభాల్లో ఈ టోల్ రోడ్డును వ్యుహత్మకంగానే అమ్మాలని నిర్ణయించింది.నాన్ కోర్ వ్యాపారాలను విక్రంచాలన్న రిలయన్స్ ఇన్ ఫ్రా స్ట్ర్రక్చర్ వ్యుహ ప్రణాళికకు అనుగుణంగానే ఈ ఒప్పందం ఉంది..రిలయన్స్ ఇన్ ఫ్రా ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్ర్రక్షన్ వ్యాపారం దృష్టి పెట్టి అధిక వృద్దిని సాధించాలనుకుంటుంది..అందులో బాగంగానే దీన్ని అమ్మివేయనుంది.
లాభాల్లో ఉన్న టోల్ రోడ్డు,
ఢిల్లి ఆగ్రా రోడ్డును రిలయన్స్ ఇన్ ఫ్రా ఢిల్లి ఆగ్ర రోడ్డును నిర్మించేందుకు స్పెషల్ పర్పస్ వేహికిల్ ను ఏర్పాటు చేసింది..ప్రస్తుతం దాని ద్వారనే ఆపరేట్ చేస్తుంది..2012 లో ప్రారంభమైన ఈరోడ్డు లాభాల బాటలోనే ఉండగా 2038 వరకు దీనికి కన్సెషన్ పీరియడ్ ఉంది.కాగా ఈ రోడ్డు ఢిల్లి ఆగ్రాలను కలుపుతోంది.ఈ ప్రాజెక్టు ద్వార 2018 ఆర్ధిక సంవత్సరంలో 25 వృద్ది సాధించినట్టు తెలిపింది.