For Quick Alerts
For Daily Alerts
నత్తనడకన స్టాక్ మార్కెట్లు..!
|
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఢీలాపడ్డాయి. బుధవారం ట్రేడింగ్ మందకొడిగా సాగుతోంది. 9 గంటల 47 నిమిషాలకు సెన్సెక్స్ పది పాయింట్ల లాస్తో 36 వేల 433 వద్ద ట్రేడ్ కాగా, 2.95 పాయింట్ల ప్రాఫిట్ తో 10 వేల 926 వద్ద నిఫ్టీ ట్రేడయ్యాయి. క్రూడ్ ఆయిల్ రేట్లతో పాటు ఆసియా మార్కెట్లు రూపాయిని ప్రభావితం చేయడంతో మందకొడిగా సాగుతున్నాయి స్టాక్ మార్కెట్లు.
మరోవైపు దాదాపు యాభై కంపెనీల వరకు ఫలితాలు ప్రకటించే అవకాశముంది. అందులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో పాటు భారతి ఇన్ఫ్రాటెల్, విజయాబ్యాంక్ తదితర సంస్థలున్నాయి. మిడ్ క్యాప్ సూచీ 42, స్మాల్ క్యాప్ సూచీ 39 పాయింట్ల ప్రాఫిట్ తో ట్రేడవుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి 27 పైసలు కోలుకొని 71 రూపాయల 17 పైసల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్ సంస్థ షేర్ ట్రేడింగ్ చూసినట్లయితే ఒక్క శాతం లాస్ గా కనిపిస్తోంది.
Comments
English summary
నత్తనడకన స్టాక్ మార్కెట్లు..! | domestic stock markets were upset
Story first published: Wednesday, January 23, 2019, 10:54 [IST]