20 నిమిషాల ముందొస్తేనే... రైల్లోకి లేదంటే అంతే సంగతి...?
ఇక నుంచి రైల్వే స్టేషన్లు కూడా ఎయిర్ పోర్టులాగా మారిపోతున్నాయి. విమానం ఎక్కాలి అంటే ఎలాగైతే మనము గంట ముందర వెళ్లి సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకొని చెక్ ఇన్ చేయాలో ఇక నుంచి రైలు ఎక్కాలి అనుకున్న అదే పద్దతి తప్పదు.
రైలు బయలుదేరే కనీసం 20 నిమిషాల ముందు మీరు స్టేషన్ లోకి అడుగు పెడితేనే ప్రయాణం లేదంటే సంగతులు కొత్తగా అమలులోకి తెస్తున్నా భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఈ విధానం తెస్తున్నట్లు రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ తెలిపారు.
ఎయిర్ పోర్ట్ తరహా చెకింగ్ ఇప్పటికే యూపీ లోని ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్ లో అమలు చేస్తున్నట్లు అయన పేరుగొన్నారు అంతేకాక త్వరలో మరో 202 రైల్వే స్టేషన్ లో ఈ నిబంధన అమలులోకి తీసుకొస్తాము అని అయన అన్నారు.
ఇక నుంచి రైల్వే స్టేషన్ కి వచ్చే ప్రతి 10 మందిలో 8 మందిని చెక్ చేయాలి అని తమ లక్ష్యంగా పెట్టుకున్నాము అని అయన అన్నారు. 2016 లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ భాగంగా సి సి కెమెరా పెంపు ప్రయాణికుల లగేజ్ చెకింగ్, బాంబు డిటెక్షన్ వంటి చర్యలు తీసుకుంటున్నాము అని అరుణ్ కుమార్ చెప్పారు.