అమరావతి కి రిలయన్స్ వరాలు !
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆంధ్రప్రదేశ్ పై పెటుబడిలా వరాలు కురిపించారు.పారిశ్రామిక,విద్య ,వ్యవసాయం,ఆరోగ్య రంగాలలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు.
తిరుపతి లో 150 ఎకరాల ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు.అమరావతి లో డిజిటల్ పార్క్ ,పెద్దాపురం లో 150 మెగా వాట్ల సౌరవిథిక్ ప్లాంట్, డేటా కేంద్రం ఏర్పాటు చేస్తాం అని అయన వెల్లడించారు.
తిరుపతి :
తిరుపతి లో 150 ఎకరాల లో ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు.ఎక్కడ పది (10 ) మిలియన్ల జియో ఫోన్ ల తయారీ, TV చిప్ డిజైన్ లు,బ్యాటరీలు ,సెటప్ బాక్సల తయారీ కేంద్రం,ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. రిలయన్స్ సంస్థ ఇదే పార్క్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ లో విద్యార్థిలకు శిక్షణ ఇయ్యననుంది.
అమరావతి :
అమరావతి లో 50 ఎకరాలలో డిజిటల్ పార్క్ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం నుండి ప్రజలకు అందించే వివిధ సేవలను అతి తక్కువ ధరలకు అందిచేనుదుకు 5 వేల గ్రామాలలో సిటిజెన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
డేటా సూపర్ పవర్ గ ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడం లో రిలయన్స్ సహకారం అందించనుంది.
పెద్దాపురం:
పెద్దాపురంలో 150 మెగా వాట్ల సోలార్ ప్లాంట్, డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు.
అమరావతిని స్మార్ట్ సిటీ ల తీర్చిదిద్దడానికి రిలయన్స్ పూర్తి సహకారం అందిస్తుంది అన్నారు.
సచివాలయం :
సచివాలయం లో ని రియల్ టైం గవర్నెన్స్ సమావేశం అనంతరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో విందు బేటీ లో దాదాపు రెండు గంటల పటు పాల్గొన్నారు.
వ్యవసాయం లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న మార్పులు మరియు ప్రవేశ పెడ్తున్న విధివిధానాలు ముఖ్య మంత్రి అంబానీ కి వివరించారు.
విద్య వైద్య రంగాల తో పాటు ముక్యంగా వ్యవసాయ రంగం లో కలిసి పని చేయాలనీ ముకేశ్ అంబానీ ఆకాంశించారు.
భాగస్వామ్యం:
100 కొత్త పరిశ్రమల స్థాపన కు చంద్రబాబు తో భాగస్వామ్యం పనిచుకోవాలని ఉంది అని ముకేశ్ అంబానీ అన్నారు.
అన్ని రకాల ప్రతిపాదనలతో వస్తే పూర్తి సహకారం ఇస్తాము అన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముకేశ్ అంబానీ కి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి నివాసం:
నది తీరం వెంబడి ఉన్న సీఎం నివాసం ప్రాంగణం పట్ల అంబానీ పూర్తి సంతృప్తి వ్య్తక్తం చేశారు
విందు :
విందులో పూర్తి శాకాహార భోజనమే తీసుకున్న అంబానీ. కాకినాడ కాజా ఆత్రేయపురం పూత లేకులు ,ఒంగోలు మైసూర్ పాక్, లను ఇష్టంగా తిన అంబానీ చెరుకు రసం కూడా తాగారు.బాబాయ్ ఇడ్లీ తో పాటు దోస,ఉత్తప్పం,రుచి చూసాడు.ఉలవచారు పట్ల ముకేశ్ అంబానీ మక్కువ ఎక్కువ చూపినట్లు తెలుస్తోంది.
అన్ని ఒరగనిక్ వంటకాలే అంటూ సీఎం వడ్ఢిచినట్లు తెలుస్తోంది
వీడ్కోలు :
ముకేశ్ అంబానీకి వీడ్కోలు పలికే సమయంలో తిరుమల శ్రీవారి చిత్రపటం తో పాటు స్వామి వారి లడ్డు ని ఇచ్చారు. అలాగే నీతూ అంబానీ కి ఉప్పాడ చీరని ఇచ్చారు
ఎయిర్ పోర్ట్ :
ఐటీ మంత్రి నారా లోకేష్ ముకేశ్ అంబానీ గారిని గన్నవరం ఎయిర్ పోర్ట్ లో గణస్వాగతం పలికి తిరిగి వీడ్కోలు పలికారు.