కొత్త స్కాల్కర్షిప్ ప్రొగ్రామ్ను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1.30 లక్షల మంది డెవలపర్లకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే ప్లూరల్సైట్ టెక్నాలజీ లెర్నింగ్ ప్లాట్ఫ
ఎప్పుడూ కొత్త విషయాల గురించి పరిశోధనల్లో మునిగి తేలే సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరం సాంకేతికతకు అనుగుణంగా భారతీయ యువతను తయారు చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. ఇందుకోసం టెక్నాలజీ లెర్నింగ్ ఫ్లాట్ఫాం ప్లూరల్సైట్, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ ఉడాసిటీతో కలిసి ఓ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో కొత్త స్కాల్కర్షిప్ ప్రొగ్రామ్ను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1.30 లక్షల మంది డెవలపర్లకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే ప్లూరల్సైట్ టెక్నాలజీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా లక్ష మందికి, ఉడాసిటీ ద్వారా మరో 30 వేల మందికి గూగుల్ ఉపకారవేతనాలను అందించనుంది.

ఈ స్కాలర్షిప్ ద్వారా భారతీయ విద్యార్థులు లేటెస్ట్ టెక్నాలజీ విద్యను అభ్యసించడంతో పాటు మొబైల్, వెబ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, వర్చ్యూవల్ రియాల్టీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లౌడ్ ప్లాట్ఫామ్లలో ఉద్యోగావకాశాలు పొందే అవకాశముంది. ఈ కొత్త స్కాలర్షిప్ ప్రొగ్రామ్తో భారత్లో 20 లక్షల మంది డెవలపర్లను తయారు చేసే లక్ష్యంతో గూగుల్ ముందుకు వచ్చింది. ప్రపంచంలో భారతదేశం రెండో అతిపెద్ద శిక్షణా కేంద్రంగా అభివృద్ది చేయాలని గూగుల్ తలంపుగా ఉంది. 2021 నాటికి ఇక్కడ ఉండే శిక్షణా కేంద్రం అమెరికాను అధిగమించనుందని గూగుల్ డెవలపర్ ప్రాడక్ట్స్ గ్రూప్ అండ్ స్కిల్లింగ్ లీడ్ ఫర్ ఇండియా విలియమ్ ఫ్లోరెన్స్ తెలిపారు. రానున్న మూడు సంవత్సరాల్లో కొత్తగా 20 లక్షల మంది ఆండ్రాయిడ్ డెవలపర్లకు గూగుల్ శిక్షణ ఇస్తుందని సీఈవో సుందర్ పిచాయ్ 2015లోనే ప్రకటించిన సంగతి విదితమే.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications