9 నెలల వేతనంతో ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న కాగ్నిజెంట్
అసోసియేట్ డైరెక్టర్ స్థాయి నుంచి బోర్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వారికి ర్యాంకు ఆధారంగా పరిహారం చెల్లించనున్నారు. పరిహారం కూడా కనీసం 9 నెలల జీతం ఉండేట్లుగా సంస్థ
భారత్లో లక్షల మంది ఉద్యోగులను కలిగిన అమెరికన్ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ చాలా మందికి ఉద్వాసన పలికే క్రమంలో చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది ఆ సంస్థ పలు ఉన్నత స్థాయి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ టెక్నాలజీ వైపు మళ్లుతున్న నేపథ్యంలో సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. గతేడాదితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్యను కుదించుకోవాలని ఆ కంపెనీ చూస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. డిజిటల్ పద్ధతుల్లోకి మారేందుకు, నాణ్యత, సుస్థిరాభివృద్ధి సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు పరిహారం చెల్లించనుంది.
కంపెనీలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తోంది. అసోసియేట్ డైరెక్టర్ స్థాయి నుంచి బోర్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వారికి ర్యాంకు ఆధారంగా పరిహారం చెల్లించనున్నారు. పరిహారం కూడా కనీసం 9 నెలల జీతం ఉండేట్లుగా సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం గత మూడు నెలలుగా చర్చలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం రూ.40లక్షలను వేతనంగా అందుకుంటున్న వారు 'స్వచ్ఛంద ఉద్యోగ విరమణ' కిందకు రానున్నారు.