4 లావాదేవీలు మించితే రుసుములు విదించేందుకు ప్రైవేటు బ్యాంకులు సిద్దమవుతున్నాయి. రూ. 150 వరకూ ఇది ఉంటుందని హెచ్డీఎఫ్సీ ప్రకటనలో పేర్కొంది. అదే బాటలో ఐసీఐసీఐ, యాక్సిస్ సిద్దమ
ప్రైవేటు బ్యాంకులు నగదు లావాదేవీలపై కొరడా ఝులిపిస్తున్నాయి. ప్రతి నెలా 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతిస్తున్న హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు ఆ తర్వాత రుసుముల బాదుడుకు సిద్దమయ్యాయి.ఈ నేపథ్యంలో 4కు మించి చేసే లావాదేవీలపై వివిధ బ్యాంకులు ఏ విధంగా వ్యవహరించనున్నాయో తెలుసుకుందాం.

పరిమితి మించితే
నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్లు ఆ పరిమితికి మించితే ఒక్కో లావాదేవీపై బుధవారం నుంచి రుసుముగా కనీసం రూ.150 వసూలు చేస్తున్నాయి. సేవింగ్, శాలరీ ఖాతాలకూ ఈ రుసుము వర్తిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. థర్డ్ పార్టీ నగదు లావాదేవీలను ఈ బ్యాంకు రోజుకు రూ.25వేలకు పరిమితం చేయనుంది. ఐసీఐసీఐ వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం.. హోం బ్రాంచిలో ఒక నెలలో తొలి నాలుగు నగదు లావాదేవీలకు రుసుము ఉండదు. ఆ తర్వాత నుంచి ప్రతి రూ.వెయ్యికి రూ.5 వసూలు చేస్తారు. కనీస రుసుము రూ.150గా నిర్ణయించింది.

హోం బ్రాంచీ కాకపోతే నెలలో తొలి లావాదేవీ మాత్రమే ఉచితం
అంతేగాక, థర్డ్ పార్టీ నగదు లావాదేవీల పరిమితిని రోజుకు రూ.50వేలుగా నిర్ణయించింది. హోం బ్రాంచి కాని వాటిల్లో నెలలో తొలి నగదు లావాదేవీ ఉచితమని ఐసీఐసీఐ తెలిపింది. ఆ తర్వాత నుంచి రూ.1000కి రూ.5 రుసుము వసూలు చేస్తారు. కనీస రుసుము రూ.150గా ఉంటుంది. నగదు స్వీకరించే యంత్రంలో నెలలో తొలి జమకు రుసుము ఉండదు. ఆ తర్వాత రూ. వెయ్యికి రూ.5 వసూలు చేస్తారు.

యాక్సిస్ బ్యాంకు
ఇక యాక్సిస్ బ్యాంకు విషయానికొస్తే.. తొలి ఐదు లావాదేవీలు లేదా రూ.10లక్షల నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలకు రుసుము ఉండదు. ఆ తర్వాత రూ.150 లేదా రూ.వెయ్యికి రూ.5 ఏది ఎక్కువయితే ఆ మొత్తం రుసుముగా వసూలు చేస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుసుములు వసూలు చేస్తాయా లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఇటువంటి రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు రాలేదని కొంతమంది బ్యాంకు సీనియర్ అధికారులు చెబుతున్నారు. బ్యాంకులు వీటిక్కూడా రుసుములు విధిస్తాయా?

లాభార్జన కోసమా? నగదు రహితానికా?
కొత్తగా అమలు చేస్తున్న రుసుములను మార్చి 1 నుంచే వర్తింపజేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ప్రయివేటు బ్యాంకులన్నింటికీ బ్యాంకులు అందజేస్తున్న ఇతర సేవలను కూడా ఒక ఆదాయ వనరుగా చూస్తున్నాయి. అందుకే మొదట లావాదేవీలకు పరిమితి విధించాయి. ఆ తర్వాత మొదట్లో నామమాత్రపు రుసుములు వసూలు చేస్తామని ప్రకటించాయి. ఇప్పుడేమో పరిమితికి మించిన నగదు లావాదేవీలపై రుసుములతో కస్టమర్లను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ చర్యలు ఖాతాదార్లను నగదు రహితంగా చేసేందుకా, లేకపోతే బ్యాంకుల లాభదాయకతను పెంచేందుకా అని పలువురు బ్యాంకు ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications