పోస్టల్ బ్యాంకులో రూ. 25 వేల లోపు డిపాజిట్లపై 4.5% వడ్డీ
ఈ బ్యాంకులో రూ. 25,000 లోపు డిపాజిట్లపై 4.5%, రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకూ చేసే డిపాజిట్లపై 5%, రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకూ డిపాజిట్లపై 5.5% వడ్డీ రూపేణా చెల్లిస్తారు.ఈ బ్యాంకు పెయిడ
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ప్రయోగాత్మకంగా తన సేవలను ప్రారంభించింది. రాయ్పూర్, రాంచీలలో గత సోమవారం కార్యకలాపాలు ప్రారంభించినట్లు సీఈవో ఎపీ సింగ్ తెలిపారు. ఈ బ్యాంకులో రూ. 25,000 లోపు డిపాజిట్లపై 4.5%, రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకూ చేసే డిపాజిట్లపై 5%, రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకూ డిపాజిట్లపై 5.5% వడ్డీ రూపేణా చెల్లిస్తారు.ఈ బ్యాంకు పెయిడప్ ఈక్విటీ 800 కోట్ల రూపాయలు కాగా, ఇందులో ప్రభుత్వం ఇప్పటికే275 కోట్ల వరకూ సమకూర్చిందని సింగ్ వెల్లడించారు.
టర్మ్ పాలసీ గురించి ఈ విషయాలు తెలుసుకున్నారా?
దేశంలో పోస్టల్ నెట్వర్కింగ్ మారుమూల ప్రాంతాల్లో సైతం ఉంది. ఇది పోస్ట్ పేమెంట్స్ బ్యాంకింగ్నకు కలిసొచ్చే అంశం. దేశవ్యాప్తంగా పోస్టాఫీసు శాఖ నిర్వహణలో ఉన్న 1000 ఏటీఎంలను భవిష్యత్తులో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ)కు బదిలీ చేస్తారు. 2017 సెప్టెంబరు నాటికి 650 ఐపీపీబీ శాఖల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. పేమెంట్స్ బ్యాంకుల ఏర్పాటు కోసం అనుమతి పొందిన వాటిలో ఎయిర్టెల్, పేటీఎమ్ సైతం ఉన్న సంగతి తెలిసిందే.