న్యూజెర్సీని కేంద్రంగా కలిగి ఉన్న కాగ్నిజెంట్, భారత్లో అత్యధిక ఉద్యోగులతో ఐటీ ఔట్ సోర్సింగ్ సేవలందిస్తూ గత కొంత కాలంగా ఇన్ఫోసిస్ ఆర్ధిక ఫలితాలను అధగమించి ఇండియాలో రెండో అతి పెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది.
ఇప్పుడు కాగ్నిజెంట్ నెంబర్ వన్ స్ధానంపై కన్నేసింది. ప్రస్తుతం భారత్ ఐటీ రంగంలో టీసీఎస్ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతోంది. ఈ రెండు కంపెనీల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పటికీ, సంవత్సరంలో 20 శాతం వరకూ వృద్ధి రేటుని అంచనా వేస్తోన్న సంస్ధ సాధ్యమైనంత త్వరలో టీసీఎస్ను అధిగమిస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.

కాగ్నిజెంట్ అంచనా వేస్తున్నట్టు 2015 ఆర్ధిక సంవత్సరంలో 19.3 శాతం వృద్ధి నమోదైతే సంస్ధ ఆదాయం 12,24 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 77,736)కు చేరుతుంది. అదే సమయానికి మార్చి 2016 నాటికి టీసీఎస్ ఆదాయం 18 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.14 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా.
అయితే, గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది టీసీఎస్ కన్నా కాగ్నిజెంట్ మంచి ఫలితాలు రాబడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే టీసీఎస్ను కాగ్నిజెంట్ అధిగమించడంలో ఎలాంటి సందేహాం లేదు.

గత మార్చి త్రైమాసికంలో టీసీఎస్ నికర ఆదాయ వృద్ధి 1.6 శాతం కాగా, కాగ్నిజెంట్ సంస్ధ ఏకంగా 4 శాతాన్ని నమోదు చేసింది. దీంతో భారత్లోని మిగతా ఐటీ కంపెనీలతో పోలిస్తే, కాగ్నిజెంట్ మరింత అభివృద్ధి వైపు దూసుకుపోతోంది.
ఇక జనవరి - మార్చి మధ్య కాలంలో టీసీఎస్ 1,031 మంది కొత్త వారిని విధుల్లోకి తీసుకుంటే, కాగ్నిజెంట్ 6,200 మందికి ఉద్యోగాలివ్వడం గమనార్హం. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే రాబోయే కాలంలో భారత ఐటీ రంగంలో నెంబర్ వన్ స్ధానాన్ని కాగ్నిజెంట్ కైవసం చేసుకునే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంటున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications