వాషింగ్టన్: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధిరేటు 6.3 శాతానికి ఎగబాకవచ్చని, 2016లో 6.5 శాతానికి చేరుకోవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తున్నది. అంతేకాదు వృద్ధిరేటు విషయంలో వచ్చేఏడాది ఇండియా చైనాను అధిగమించనుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో ఐఎంఎఫ్ వెల్లడించింది.
ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ సర్కారు చేపట్టిన సంస్కరణలు అభివృద్ధికి బాటలు వేయనున్నాయని, అయితే వాటి అమలే కీలకమని పేర్కొంది. నిరుడు దేశ వృద్ధిరేటు 5.8 శాతంగా నమోదుకాగా.. చైనాలో 7.4 శాతానికి పడిపోయింది. గడిచిన 24 ఏండ్లలో చైనాకిదే అత్యంత కనిష్ఠ వృద్ధిరేటు. ఈ సంవత్సరం చైనా జీడీపీ 6.8 శాతానికి, 2016లో 6.3 శాతానికి పరిమితం కానుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నది.

మన మామిడిపై నిషేధం ఎత్తివేత
లండన్: భారత మామిడి దిగుమతులపై యూరోపియన్ యూనియన్ దేశాలు (ఈయు)నిషేధం ఎత్తివేశాయి. ఏడు నెలల తర్వాత ఈయు మంగళవారం ఈ నిషేధాన్ని ఎత్తివేయగా, ఈయు హెల్త్ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఇప్పుడు భారత మామాడి ఉంటోందని, అందుకే నిషేధాన్ని ఎత్తివేసేందుకు నిర్ణయించుకున్నామని యూరోపియన్ కమిషన్ కమిటీ తెలిపింది.
బ్రస్సెల్స్లో జరిగిన సమావేశంలో ఈయు సభ్యదేశాలు భారత్ నుంచి మామిడి దిగుమతులను అనుమతించాలని తీర్మానించాయి. ఇందుకు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే భారత కూరగాయల దిగుమతులపై విధించిన నిషేధాన్ని మాత్రం ఎత్తివేయలేదు. మరోదఫా కూరగాయల శాంపిల్స్ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాకే ఓ నిర్ణయానికి వస్తామని, తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications