For Quick Alerts
For Daily Alerts
ఎస్ఎంఎస్ సేవలకు సర్వీస్ చార్జీ వసూలు చేయనున్న హెచ్డీఎఫ్సీ
|
ఏప్రిల్ 1, 2013 నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్ రిజిష్టరు చేసుకున్న ఖాతాదారులు అదనంగా రుసుం చెల్లించాల్సిందిగా కోరింది. ఇన్స్టా అలర్ట్ క్రింద రిజిష్టర్ చేసుకున్న పొదుపు ఖాతాదారులు/శాలరీ ఎకౌంట్ కలిగిన వారు మూడు నెలలకు రూ.15, అదే కరెంటు ఖాతాదారులు మూడు నెలలకు రూ. 25 చెల్లించాల్సిందిగా ప్రకటనలో పేర్కొంది. ఐతే బ్యాంకుకు సంబంధించి డెబిట్కార్డు లేదా క్రెడిట్కార్డు లావాదేవీల ద్వారా జరిగే వాటికి ఎలాంటి చార్జీలు వసూలు చేయరని తెలిపింది.
కస్టమర్లు ఇప్పటికే ఈ సర్వీసులో రిజిష్టరు చేసుకున్న వారికి ఉచితంగా అందు బాటులో వస్తాయి. ఈ సేవలు ఇండియాలో హెచ్డీఎఫ్సీ ఖాతా కలిగిన వారితో పాటు, విదేశాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎకౌంట్ కలిగిన వారికి వర్తిస్తాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్పేర్కొంది.
వన్ఇండియా తెలుగు మనీ
Comments
English summary