19 స్కీములను నిలిపివేసిన ఎస్బీఐ, ఎల్ అండ్ టి మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్లపై ఇటీవల సెబీ 10 మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో ఇక సిప్ను అనుమతించడం లేదని బాంబే స్టాక్ ఎక్సేంజ్కి ఎస్బీఐ మ్యూచవల్ ఫండ్ తెలిపింది. 9 స్కీముల్లో సిప్ను తొలగిస్తున్నట్లు కొత్త ఎస్ఐపీ (సిస్టెమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) రిజిస్ట్రేషన్లో ఎల్ అండ్ టీ మ్యూచువల్ ఫండ్ పేర్కోంది. ఈ ఫండ్హౌజ్లు బీఎస్ఈకి ఈ స్కీంలు ఎక్కడ లిస్టు అవుతాయో తెలియజేసింది. ఈ నెల ప్రారంభంలో సెబి గెైడ్లెైన్స్ను అనుసరించి అతి పెద్ద ఫండ్ హౌజ్లు రిలయన్స్, ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్ ఎంఎఫ్లు మొత్తం 190 స్కీములను ఉపసంహరించు కున్నాయి.
సెబీ గెైడ్ లెైన్స్ ప్రకారం ఫండ్ హౌజ్లు ఈ నెల నుండి ఒక ప్లాన్ ఒక నెల అనే పద్ధతిని అమలు చేస్తున్నాయి. దీంతో ఫండ్హౌజ్లకు చెందిన కొన్ని వందల స్కీములపై ఈ ప్రభావం పడింది. ఎస్ఐపీ కింద ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు నెలకు రూ.100 చొప్పున పెట్టుబడి పెట్టి మార్కెట్ పెరిగినప్పుడు దాని నుంచి లబ్ధి పొందే అవకాశాన్ని సెబి కల్పించింది. దీంతో పలు పౌండ్హౌజ్లు ఒక స్కీం పేరుతో పలు ఎస్ఐపీ ప్లానులను ప్రారంభించింది. ఇన్వెస్టర్లకు ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సెబి ఈ చర్యలను తీసుకుంది.
తెలుగు వన్ఇండియా