ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త. మీరు ఈ ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకుకు చెందిన యోనో యాప్ ద్వారా ఐటీ రిటర్న్స్ను దాఖలు చేయవచ్చు. యోనోలోని ట్యాక్స్2విన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR)ను దాఖలు చేసే వెసులుబాటు కల్పిస్తోంది ఎస్బీఐ. ఈ సౌకర్యాన్ని గతంలోనే తీసుకు వచ్చినప్పటికీ, ఇటీవల ఇందుకు సంబంధించి తమ కస్టమర్లకు సమాచారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. 'మీరు ITR దాఖలు చేయాలని భావిస్తున్నారా? యోనో యాప్లోని ట్యాక్స్2విన్ ద్వారా ఉచితంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. ఇందుకోసం మీ వద్ద ఐదు డాక్యుమెంట్స్ ఉండాలి. ఎస్బీఐయోనో (sbiyono.sbi) డౌన్ లోడ్ చేసుకొని ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు' అని ట్వీట్ చేసింది.

కావాల్సిన డాక్యుమెంట్స్
ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి కింది డాక్యుమెంట్స్ అవసరం.
1) పాన్ కార్డు - PAN card
2) ఆధార్ కార్డు - Aadhaar card
3) ఫామ్ 16 - Form-16
4) ట్యాక్స్ డిడక్షన్ వివరాలు - Tax deduction details
5) ఇంటరెస్ట్ ఇన్కం సర్టిఫికెట్ - Interest income certificates
6) - ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ Investment proofs for tax saving

ఇలా ఫైలింగ్
ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి కస్టమర్లు కింది స్టెప్స్ పాటించాలి.
- కస్టమర్లు మొదట ఎస్బీఐ యోనో యాప్లోగా లాగ్-ఇన్ కావాలి.
- ఆ తర్వాత యూజర్లు Shops and Orders ఆప్షన్ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత Tax and Investment పైన క్లిక్ చేయాలి.
- అక్కడ Tax2Win అనే ఆప్షన్ను ఎంచుకోవాలి.
- ఇక్కడ ఐటీఆర్కు సంబంధించిన సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. అందులోని స్టెప్స్ను అనుసరించడం ద్వారా ఐటీఆర్ను సులభంగా దాఖలు చేయవచ్చు.

ఐటీ రిటర్న్స్ గడువు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) ఆర్థిక సంవత్సరం 2020-21గాను వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఈ గడువు తేదీని డిసెంబర్ 31,2021 పెంచుతున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మరి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా గతంలో సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. ఈ గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications