ఈరోజు(సెప్టెంబర్ 18, శుక్రవారం) నుండి ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)కు చెందిన అన్ని ఏటీఎంలలో రూ.10,000 అంతకంటే ఎక్కువ నగదు తీసుకునే వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే.. వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారానే నగదును ఉపసంహరించుకోవచ్చు. అందుకే ఏటీఎం నుండి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్తే కనుక మీ వెంట తప్పనిసరిగా రిజిస్టర్డ్ మొబైల్ను తీసుకువెళ్లాలి. ఎందుకంటే బ్యాంకు పంపించిన వన్ టైమ్ పాస్వర్డ్(OTP)ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ ఏటీఎంలలో ఈ రోజు నుండే వన్ టైమ్ పాస్వర్డ్ ఆధారిత ఉపసంహరణ అమలులోకి వస్తోంది.

మొబైల్ లేకుంటే ట్రాన్సాక్షన్ రద్దు!
ఏటీఎంలో నగదు ఉపసంహరణలో భద్రతాస్థాయిని మరింత పెంచేందుకు ఎస్బీఐ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణను తీసుకు వచ్చింది. మోసగాళ్లు, అనధికార ఉపసంహరణల నుండి కార్డు స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ ప్రమాదాల నుండి నివారించేందుకు ఎస్బీఐ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే రాత్రి ఎనిమిది గంటలనుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంది. ఇప్పుడు రోజంతా అందుబాటులోకి వస్తోంది. కాబట్టి రూ.10వేలు అంతకంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేయాలనుకుంటే ఓటీపీ కోసం మొబైల్ వెంట తీసుకు వెళ్లాలి. లేదంటే ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవుతుంది.

నగదు ఉపసంహరణ ఇలా..
- ఎస్బీఐ ఏటీఎం నుండి నగదు ఉపసంహరణకు ఓటీపీ తప్పనిసరి.
- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ కేవలం ఒక ట్రాన్సాక్షన్ కోసం మాత్రమే పరిమితం అవుతుంది.
- ఏటీఎంకు వెళ్లి మీరు నగదు ఉపసంహరణ కోసం మీరు తీసుకునే మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత, ఏటీఎం స్క్రీన్ పైన ఓటీపీ పేజీ డిస్ప్లే అవుతుంది.
- అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
- అనధికార ఏటీఎం ఉపసంహరణ నుండి ఇది రక్షిస్తుంది.
- నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (NFS)లోని ఎస్బీయేతర ఏటీఎంలలో దీనిని ఇంకా డెవలప్ చేయలేదు. కాబట్టి ప్రస్తుతం ఈ సౌకర్యం ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే ఉంది.

ఎప్పటికప్పుడు జాగ్రత్తలు
డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుకు సంబంధించి ఎస్బీఐ సహా ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు ఎప్పటికి అప్పుడు సెక్యూరిటీ టిప్స్ జారీ చేస్తుంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఓటీపీ ఆధారిత ఉపసంహరణ వంటి వాటిని తీసుకు వస్తూ కస్టమర్లకు మరింత భద్రతను కల్పిస్తున్నాయి. బ్యాంకులు సూచించే కొన్ని జాగ్రత్తలు...
మీ ఏటీఎం పిన్ ఎవరికీ చెప్పవద్దు. మీ పిన్ నెంబర్ను ఎవరితోను షేర్ చేసుకోవద్దు. ఫ్రాడ్స్టర్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు మీ పిన్ నెంబర్, కార్డు నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్ వంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. గుర్తు తెలియనివారు పంపించే లింక్స్ పైన క్లిక్ చేయవద్దు. మీ స్టేట్మెంట్ను నిత్యం చెక్ చేస్తూ ఉండాలి. మీ కార్డు, బ్యాంకు స్టేట్మెంట్ను మానిటర్ చేసుకోవాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications