ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI తమ కస్టమర్లు ఆన్లైన్ ద్వారా బ్రాంచీని మార్చుకునే వెసులుబాటును కల్పించింది. సేవింగ్స్ ఖాతాదారులు తమ శాఖను మార్చుకోవాలని భావిస్తే ఇక నుండి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఆన్లైన్ ద్వారా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో SBI ఈ మేరకు స్పష్టం చేసింది. యోనో SBI, యోనో లైట్, ఆన్లైన్ ఎస్బీఐ వినియోగం ద్వారా ఖాతాను సులభంగా అందుబాటులోని మరో ఎస్బీఐ శాఖకు బదిలీ చేసుకోవచ్చునని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.

వీటి ద్వారా మార్చుకోవచ్చు
కరోనా సమయంలో SBI కస్టమర్లకు ఇది గుడ్న్యూస్ అని చెప్పవచ్చు. తమ సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంకు శాఖను మార్చుకోవడానికి బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం లేదు. ఎస్బీఐకి చెందిన యోనో ఎస్బీఐ, యోనో లైట్ యాప్స్తో పాటు ఆన్లైన్ ఎస్బీఐ వెబ్సైట్ ద్వారా మార్చుకోవచ్చు. కరోనా సమయంలో బ్యాంకుల వద్ద రద్దీని నియంత్రించే ఉద్దేశ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇలా చేయండి
బ్యాంకు శాఖను మార్చుకోవడానికి ముందు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు అయి ఉండాలి. ఇది వరకు సదరు బ్రాంచీలో మీ మొబైల్ నెంబర్ వివరాలు అప్ డేట్ అయి ఉండాలి.ముందుగా ఎస్బీఐ ఆన్లైన్లో పర్సనల్ బ్యాంకింగ్ విభాగంలోకి వెళ్లి యూజర్ నేమ్, పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి.

ఓటీపీ వచ్చాక..
తర్వాత ఈ-సర్వీస్ విభాగంలోని ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్పైన క్లిక్ చేయాలి. మీరు మార్చుకోవాలని భావిస్తున్న బ్రాంచీ IFSC కోడ్ ఎంటర్ చేయాలి.వివరాలు పూర్తి చేశాక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత కొద్దిరోజుల్లో మీ అకౌంట్ మీరు కోరుకున్న బ్రాంచీకి మారుతుంది.యోనో యాప్, యోనో లైట్లో కూడా ఇదే ప్రక్రియ. ఇందుకు ముందుగా మీ బ్యాంకు ఖాతాను అనుసంధానించాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications