ఇండియన్ రైల్వేలో పెరగనున్న భోజనం, టిఫిన్ ధరలు, ఎంతంటే? షేర్ల దూకుడు
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) షేర్లు మంగళవారం దూసుకెళ్లాయి. ఈ షేర్లు దాదాపు 3 శాతం పెరిగి రూ.893కు చేరుకున్నాయి. అయితే దీనికి కారణం ఉంది. IRCTC ఆహార ధరలను సవరించింది. దీంతో షేర్లు దూసుకెళ్లాయి. సవరించిన ధరలు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లలో ఈ ధరలు అందుబాటులోకి వస్తాయి. అంటే అక్కడి ధరలు ఇక నుంచి మారనున్నాయి.
బంగారంపై రుణం తీసుకుంటున్నారా? అయితే ఈ పొరపాటు చేయకండి!
రైల్వే స్టేషన్లలో కొత్త ధరలు
ఆహార ధరలను సవరిస్తున్నట్లు, రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లకు ఈ ధరల మార్పు వర్తిస్తుందని IRCTC ఈ రోజు (డిసెంబర్ 24) స్టాక్ ఎక్స్చేంజీకి ఫైలింగ్లో తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఫుడ్ కేంద్రాల్లో ప్రామాణిక ఆహార ధరలను మార్చింది అని పేర్కొంది. జనాహార్, రిఫ్రెష్మెంట్ రూమ్స్ వంటి వాటికి ఇది వర్తిస్తుంది.
ఈ రైళ్లలో కూడా అదే ధర
మెనూకు సంబంధించి ఇతర ప్రామాణిక భోజనం, జనతా మీల్స్, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఇచ్చే ఫుడ్కు కూడా ఈ రేట్లు వర్తిస్తాయి. ఈ ధరల పెంపు ద్వారా IRCTC, జోనల్ రైల్వేల్లో అందించే ఫుడ్ క్వాలిటీ, క్లీనింగ్ పెరగాలని సూచించింది. దీనిని అంచనా వేసేందుకు తనిఖీలు చేయనుంది.
సవరించిన కొత్త ధరలు ఇవే...
సవరించిన ధరల ప్రకారం ఆహార పదార్థాల కొత్త రేట్లు ఇవే...
- వెజ్ బ్రేక్ ఫాస్ట్ - రూ.35,
- నాన్ వెజ్ బ్రేక్ ఫాస్ట్ - రూ.45,
- స్టాండర్డ్ వెజ్ మీల్ - రూ.70,
- స్టాండర్డ్ మీల్ (ఎగ్ కర్రీ) - రూ.80,
- స్టాండర్డ్ మీల్ (చికెన్ కర్రీ) - రూ.120,
- వెజ్ బిర్యానీ (350 గ్రాములు) - రూ.70,
- ఎగ్ బిర్యానీ (350 గ్రాములు) - రూ.80,
- చికెన్ బిర్యానీ (350 గ్రాములు) - రూ.100,
- స్నాక్ మీల్ (350 గ్రాములు) - రూ.50