స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మ్యాగ్స్ట్రిప్ (మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డు) కలిగిన కార్డులను డిసెంబర్ 31వ తేదీ నుంచి బ్లాక్ చేయనుంది. వాటి స్థానంలో కొత్తగా ఈవీఎం (యూరోపే, మాస్టర్ కార్డు, వీసా) చిప్ అండ్ పిన్ బేస్డ్ డెబిట్ కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 31వ తేదీ లోపు మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులను ఎలాంటి ఛార్జీ లేకుండా మార్చుకునే వెసులుబాటు ఎస్బీఐ కల్పించింది. ఈ నేపథ్యంలో EVM చిప్ కార్డులు ఇలా మార్చుకోవచ్చు...

హోమ్ బ్రాంచీకి వెళ్లి తీసుకోవచ్చు
EVM చిప్ కార్డులు లేని SBI కస్టమర్లు హోమ్ బ్రాంచీకి వెళ్లి తమ మ్యాగ్స్ట్రిప్ కార్డు స్థానంలో వీటిని మార్చుకోవచ్చు. మ్యాగ్స్ట్రిప్ కార్డుల స్థానంలో EVM చిప్ ఆధారిత కార్డులు తీసుకోవాలని ఎస్బీఐ తమ కస్టమర్లకు పదేపదే విజ్ఞప్తి చేసింది. డిసెంబర్ 31 తేదీలోపు కార్డులు మార్చుకోవాలి. ఆ తర్వాత వ్యాలిడిటీతో సంబంధం లేకుండా కార్డులు డీ-యాక్టివేట్ చేస్తారు. కాబట్టి ఈవీఎం చిప్ కార్డులు తీసుకోవాలి.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
కొత్త EVM చిప్ కార్డుల కోసం కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏస్బీఐ కస్టమర్లు https://www.onlinesbi.com/కు వెళ్లి ATM Card Services పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో సూచనలు పాటిస్తూ దరఖాస్తు చేసుకోవాలి.

యోనో ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ Yono app ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాగ్స్ట్రిప్కు బదులు ఈవీఎం చిప్ కార్డు తీసుకోవడానికి ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉచితంగా బ్యాంకు అందిస్తుంది. కాగా, కార్డు రిజిస్టర్డ్ చిరునామాకు వస్తుంది. కాబట్టి అడ్రస్ మారితే అప్ డేట్ చేసుకోవాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications