కరోనా గ్యాస్ ఫ్రీ: ఎల్పీజీ సిలిండర్ పాలసీ, ఇది తెలుసుకోండి
వంట గ్యాస్ సిలిండర్ల ఉచిత పంపిణీకి సంబంధించి ప్రభుత్వం విధానాన్ని సవరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏప్రిల్ నెలలో మూడు నెలల పాటు ఉచితంగ్ గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి విరుద్ధంగా, మూడో నెల సిలిండర్ తీసుకుంటే దానికి మొదట చెల్లింపులు జరపాలి. ఆ తర్వాత తిరిగి చెల్లిస్తారు. ఇది 80 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది.
IBMతో కలిసి పని చేయనున్న టెక్ దిగ్గజం TCS, ఎందుకంటే
మూడో సిలిండర్ కోసం చెల్లింపు
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) స్కీం కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు 2020 ఏప్రిల్ మే నెల నుండి 2020 జూన్ నెల వరకు 14.2 కిలోల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ఉచితంగా లభిస్తాయి. అయితే జూన్ 5వ తేదీన ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఏప్రిల్, మే నెలలో చెల్లింపులు అందుకున్న వినియోగదారులు లేదా లబ్ధిదారులు మూడో సిలిండర్ కోసం పేమెంట్ చెల్లించాలని తెలిపాయి.
ఎప్పుడు చెల్లిస్తారు
ఈ మూడో నెల కూడా సిలిండర్ ఉచితమే. అయితే ఇదివరకు బకాయిలు వంటి వాటిని తీసివేసిన తర్వాత మిగతా మొత్తాన్ని కంపెనీలు చెల్లిస్తాయి. ఈ స్కీం ప్రకారం 240.9 సిలిండర్లను చమురురంగ కంపెనీలు పంపిణి చేస్తాయని అంచనా వేశారు. కానీ అంచనాల్లో కేవలం 42 శాతం సిలిండర్లు మాత్రమే పంపిణీ చేశారు.
కరోనా టైంలో..
అలాగే అడ్వాన్స్ పేమెంట్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ను కొనుగోలు చేయని వారు మార్చి 31, 2021 వరకు ఉపయోగించుకోవచ్చు. మొదటిది ఉపయోగించినప్పుడు రెండవ చెల్లింపు చేయబడుతుంది. కరోనా - లాక్ డౌన్ కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇబ్బందులు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీంను తీసుకు వచ్చింది.