స్టాక్ మార్కెట్లో నగదు విభాగంలో ఈ రోజు (సెప్టెంబర్ 1) నుండి కొత్త మార్జిన్ల విధానం అమల్లోకి వచ్చింది. నిన్న(ఆగస్ట్ 31) బ్రోకర్లు, డిపాజిటర్లు, క్లియరింగ్ కార్పోరేషన్లతో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఈ మేరకు నిర్ణయించింది. నేటి నుండి కొత్త మార్జిన్ నిబంధనలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. పెట్టుబడిదారులకు మరింత విశ్వాసం కల్పిస్తూ, వారి పెట్టుబడులకు రక్షణ కల్పించేలా సెబి ఈ నిర్ణయం తీసుకుంది. స్టాక్ మార్కెట్లో మరింత పార్దర్శకతను కోరుకుంటోంది.

స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు గడువు కోరాయి కానీ...
నిన్న జరిగిన సమావేశంలో స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలని కోరాయి. అయినప్పటికీ సెబి మాత్రం సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఈ కొత్త విధానం అమలుకు మొగ్గు చూపింది. ఇప్పటికిప్పుడు ఈ చర్య వల్ల బ్రోకర్లు, ఇన్వెస్టర్లు సిద్ధం కావడానికి సమయం తీసుకుంటుందని, అందుకే ట్రేడింగ్ వ్యాల్యూమ్స్ తగ్గుతాయని బ్రోకింగ్ సంస్థలు చెబుతున్నాయి. డిపాజిటరీ సంస్థలైన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(CDSL), రెగ్యులేటర్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(NSDL) నాలుగు రోజుల క్రితమే సాఫ్టువేర్లో మార్పులు చేసినందున అధ్యయనం చేసేందుకు తమకు తగినంత సమయం దొరకలేదని చెబుతున్నారు.
కొత్త విధానంలో కొంత కాలం పాటు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్చేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా(ANMI) రెగ్యులేటర్ను నెల గడువు కోరింది. నేటి వర్చువల్ సమావేశంలో సమయం ఇచ్చేందుకు సెబి నిరాకరించిందని, ANMIకి చెందిన 900 మంది సభ్యులు ఈ నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారని, దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు ANMIఅధికార ప్రతినిధి తెలిపారు.

ఖాతాదారుల సెక్యూరిటీలు దుర్వినియోగం కాకుండా..
CDSL, NSDLను సెబీ అడగ్గా.. తాము కొత్త మార్జిన్ విధానానికి సిద్ధమని తెలిపాయి. దీంతో ఈ రోజు నుండి అమలుకు నిర్ణయించారు. కొత్త మార్జిన్ విధానం ద్వారా మరింత పారదర్శకత ఉంటుందని, ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేయకుండా బ్రోకరేజీలను నిరోధిస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మార్పులు ఇవే...
- ఇన్వెస్టర్ల ఖాతాతోలో తగినంత సొమ్ము లేకుండా (మార్జిన్ మనీ షార్ట్ ఫాల్) క్రయవిక్రయాలు నిర్వహిస్తే అందుకు భారీ పెనాల్టీ చెల్లించాలి.
- షేర్లు కొనేందుకు అయినా, విక్రయించేందుకు అయినా ఇన్వెస్టర్ల ఖాతాల్లో నిర్దేశించిన సొమ్ము జమ అయి ఉండాలి. షేర్లు విక్రయించి, అదే రోజు తమ డీమ్యాట్ అకౌంట్ నుండి షేర్లు బదలీ చేస్తే మార్జిన్ మనీ అవసరం లేదు.
- బై టుడే, సెల్ టుమారో పద్ధతి కుదరదు.
- ఓ కంపెనీ షేర్ కొనుగోలు చేసిన తర్వాత టీ ప్లస్ టూ పద్ధతిలో ఆ షేర్లు ఇన్వెస్టర్ల డీపీ ఖాతాలకు జమ అయిన తర్వాతే వాటిని విక్రయించడం కుదురుతుంది.
- ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ ఖాతాలో ఉన్న షేర్లను మార్జిన్ కింద పెట్టి దానిపై షేర్ల కొనుగోలుకు లిమిట్ తీసుకోవచ్చు. గతంలో అయితే ఈ షేర్లను బ్రోకర్ల పూల్ అకౌంట్కు మార్చవలసి వచ్చేది. ఇప్పుడు ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలోే ఆ ,ేర్లు తనఖా పెట్టినట్లుగా నమోదవుతుంది.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications