పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ ఇష్యూస్, ఇలా చేయవచ్చు
గత కొన్నాళ్లుగా డిజిటల్ పేమెంట్స్, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ కోసం అనేక యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఉన్నచోటు నుండి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. షాపింగ్ మాల్స్ మొదలు ఫుట్ పాత్ వరకు ఎక్కడ ఏం కొనుగోలు చేసినా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ పెరిగినా కొద్ది ఆన్లైన్ చెల్లింపులపై ఫిర్యాదులు కూడా అలాగే పెరుగుతున్నాయి.
ఆర్బీఐ నివేదిక ప్రకారం 2019-20లో 57.54శాతం ఫిర్యాదులుపెరిగాయి. మొత్తం ఫిర్యాదులలో బ్యాంకింగ్ అంబుడ్స్మన్ నుండే 44.66 శాతం ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో సకాలంలో సేవలను అందించకపోవడం, ముందస్తు నోటీసులు లేకుండా లేవీ చార్జీల వసూలు వంటివి ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈసారి NBFCలపై ఫిర్యాదులు భారీగా పెరిగాయి.
ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సంబంధిత బ్యాంకు ఉన్నతాధికారి దృష్టికి దీనిని లిఖితపూర్వకంగా తీసుకెళ్లాలి. నెల రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే అంబుడ్స్మెన్ అధికారికి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదులో బ్యాంకు ట్రాన్సాక్షన్స్ పూర్తి వివరాలు ఉండాలి. నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆ తర్వాత వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించే వెసులుబాటు ఉంది. అక్కడ ఖాతాదారు వాదన నిజమని తేలితో బ్యాంకుకు జరిమానా విధిస్తారు.