పాఠశాలకు వెళ్లే పేద పిల్లల ఆకలిని తీర్చి తద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అన్నంరిత పథకాన్ని ప్రారంభించారు.
పాఠశాలకు వెళ్లే పేద పిల్లల ఆకలిని తీర్చి తద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అన్నంరిత పథకాన్ని ప్రారంభించారు.దీని వల్ల దేశం లో అనేక మంది పేద పిల్లకు లబ్ది చేకూరనుంది.

మధ్యాహ్న భోజనం కార్యక్రమం
అన్నంరిత పథకాన్ని భారతదేశ ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజనం కార్యక్రమం మరియు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ISKCON ఆహార రిలీఫ్ ఫౌండేషన్ (IFRF)వారు అమలు చేస్తున్నారు. వీటిలో ప్రభుత్వ మరియు ప్రభుత్వ-సహాయక పాఠశాలలు ఉన్నాయి

రెండు ప్రధాన ఉద్దేశాలు
ఈ కార్యక్రమానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఒకటి పిల్లల ఆకలి తీర్చడం మరియు రెండు నిరక్షరాస్యతను పాడదోలడం.
IFRF అనేది 2004 లో ఏర్పడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబాయి లో ఉంది. మధ్యాహ్న భోజన కార్యక్రమానికి మద్దతు ఇచ్చేందుకు 20 వంటశాలలు ఏర్పాటుచేసింది.

ఏడు రాష్ట్రాల్లో
ఢిల్లీ, జార్ఖండ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి ఏడు రాష్ట్రాల్లో సుమారు 1.2 మిలియన్ల మంది పిల్లలు ఈ సౌకర్యాన్ని ప్రతిరోజూ పొందుతున్నారు.

ఎంపిక చేసిన పాఠశాలల్లో
ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకం ఎంపిక చేసిన పాఠశాలల్లో బాగానే అమలవుతోంది కానీ,ఇంకా దేశం లోని అనేక ప్రాంతాల్లో పిల్లలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు.

UNICEF నివేదిక ప్రకారం
UNICEF నివేదిక ప్రకారం, మొత్తం సుమారు దేశవ్యాప్తంగా 60 మిలియన్ల పిల్లల్లో, 50 శాతం మంది బరువు తక్కువగా ఉన్నారు, 45 శాతం వారి వయసు కన్నా చాలా చిన్నగా ఉన్నారు,75 శాతం మంది రక్తహీనతో భాదపడుతున్నారు, 27 శాతం మంది వారి ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం దీనికి ప్రధాన కారణం తీవ్రమైన పోషకాహార లోపం మరియు 75 శాతం విటమిన్ ఎ లోపం.

పిల్లలకు సహాయం
ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పట్నుండి, IFRF అనేక మంది బలహీనమైన పిల్లలకు సహాయం అందించింది. అన్నంరిత కార్యక్రమం కారణంగా, పాఠశాలల్లో హాజరు పెరిగింది మరియు పిల్లలు వారి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు.

ఆహరం యొక్క ప్రాముఖ్యత
అన్నంరిత అంటే 'food as pure as nectar'ప్రతిఒక్కరికి ఆహరం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం పిల్లలకు ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారాన్ని అందించడం.

చిన్న సహాయంతో
ఇప్పటికే అనేకమంది పిల్లలు ప్రయోజనం పొందుతున్నప్పటికీ,ఇంకా చాలా మంది పేద పిల్లలకు ఈ ప్రయోజనం ఆడాల్సి ఉంది.మీరు చేసే చిన్న సహాయంతో ఎంతో మంది పేద పిల్లల ఆకలి తీర్చచ్చంటున్నారు.

సంవత్సరానికి రూ.450 రూపాయలు
కాబట్టి, మీరు ఈ పిల్లలకు సహాయం చేయాలనుకుంటే,సంవత్సరానికి రూ.450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయం చేసి పేద పిల్లల ఆకలి మరియు నిరక్షరాస్యతను పారదోలండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications