ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ అత్యవసర పరిస్థితుల్లో అవసరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ నుండి నిబంధనల మేరకు తమ మొత్తాల నుండి నగదును ఉపసంహరించుకున్నారు. కరోనాతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పీఎప్ ఉపసంహరణ నిబంధనల్ని సడలించింది. అత్యవసరమైతే తప్ప పీఎఫ్ అకౌంట్ నుండి డబ్బును ఉపసంహరించుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. పీఎఫ్ అకౌంట్ నుండి నగదును ఉపసంహరించుకోవచ్చా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

రూ.11 లక్షలు కోల్పోయినట్లే!
అయితే ఓ పీఎఫ్ కాలిక్యులేషన్ ప్రకారం పీఎఫ్ నుండి అత్యవసరం కాకున్నప్పటికీ ఉపసంహరించుకుంటే ఎలా ఉంటుందో చిన్న లెక్క ద్వారా తెలుసుకోవచ్చు! ఉదాహరణకు మీరు పీఎఫ్ అకౌంట్ నుండి రూ.1 లక్ష మొత్తాన్ని ఉపసంహరించుకుంటే రిటైర్మెంట్ కాలం ముప్పయ్యేళ్ళు అయితే ఈ కాలానికి గాను మీరు రూ.11 లక్షలు నష్టపోయినట్లేనని చెబుతున్నారు.

ఆదాయం రూ.38 లక్షలు
మీ వయస్సు 25 సంవత్సరాలు, నెలకు వేతనం రూ.10వేలు, పీఎఫ్ అకౌంట్లో రూ.1 లక్ష సేవ్ చేసి ఉంటే కనుక ఉద్యోగి వాటా 12 శాతంతో పాటు యజమాని వాటా కూడా ఉంటుంది. అంతా సవ్యంగా సాగితే మీకు 55 ఏళ్లు వచ్చేసరికి పీఎఫ్ అకౌంట్లో రూ.38,14,026 లక్షలు ఉంటుంది. అంటే ముప్పై ఏళ్ల సర్వీస్ కాలంలో మీ ఆదాయం రూ.38 లక్షలు అవుతుంది.

ఇదీ లెక్క
మీ పీఎఫ్ అకౌంట్ నుండి మీరు రూ.1 లక్ష కనుక ఉపసంహరించుకుంటే మీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ సున్నా అవుతుంది. ఉపసంహరణ అనంతరం మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కొనసాగినప్పటికీ 55 ఏళ్ల సర్వీస్ కాలానికి రూ.26,09,290 అవుతుంది. అంటే మీరు రూ.1 లక్ష ఇప్పుడు కరోనా కారణంగా ఉపసంహరించుకుంటే రూ.11 లక్షలకు పైగా తగ్గుతుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications