సురక్షితమైన పెట్టుబడులు అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ మంత్లీ ఇన్కం స్కీం ఉత్తమమని చాలామంది భావిస్తారు. సురక్షిత మంత్లీ రిటర్స్కు ఈ రెండు స్కీంలు పాపులర్. సురక్షితమైన పెట్టుబడి, నెల నెలా స్థిర రాబడి ఇచ్చే పథకాలు ఇవి. నెలనెలా ఆదాయం కోరుకునే వారికి ఇవి అనుకూలం. విశ్రాంత ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్లకు ఇవి సరిపోతాయి. ఇందులోని పీవోఎంఐఎస్ ఖాతా గురించి తెలుసుకుందాం.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్కం స్కీం (పీవోఎంఐఎస్)
పీవోఎంఐఎస్ స్కీం కాల పరిమితి అయిదేళ్లు. దీనికి సంబంధించి వడ్డీ రేటు ఎప్పటికి అప్పుడు క్వార్టర్లీ బేసిస్ ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం వడ్డీ రేటు ఏడాదికి 7.3 శాతంగా ఉంది. ఏక వ్యక్తి ఖాతా (సింగిల్ అకౌంట్) అయితే గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు, ఉమ్మడి ఖాతా (జాయింట్ ఖాతా) అయితే గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. వడ్డీ 7.3 శాతంగా ఉంది. ఈ సమయంలో ఎవరైనా రూ.5 లక్షలను ప్రిన్సిపుల్ అమౌంట్గా ఇన్వెస్ట్ చేస్తే వారికి వడ్డీగా రూ.1,82,500 వస్తుంది. అంటే నెలకు రూ.3,041 అవుతుంది. రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీ మొత్తం 3,28,500 అవుతుంది. అంటే నెలకు రూ.5,475 అవుతుంది.

పీవోఎంఐఎస్ ఖాతాను ఇలా ప్రారంభించవచ్చు
పీవోఎంఐఎస్లో ఖాతా ప్రారంభ సమయంలో లేదా తర్వాత కూడా నామినీని ప్రతిపాదించవచ్చు. నామినీగా ఎవరినైనా ఎప్పుడైనా మార్చుకునే సౌలభ్యం ఉంది. ఖాతను ప్రారంభించడానికి ఇవి అవసరం.... పూర్తి వివరాలు నింపిన ఎంఐఎస్ ఫారంతో పాటు చిరునామా, గుర్తింపు పత్రాలు. రెండు ఫోటోలు పోస్టాఫీస్లో సమర్పించారు. ఖాతాను నగదు/చెక్కు ద్వారా చెల్లించవచ్చు. అయితే ముందే ఖాతా కలిగిన వ్యక్తి పరిచయ సంతకం అవసరం. ఓ ఖాతాదారు ఎన్ని ఎంఐఎస్ ఖాతాలు అయినా తెరవవచ్చు. అయితే అన్ని ఖాతాల మొత్తం 4.5 లక్షలకు మించరాదు. కనీస పెట్టుబడి రూ.1500తో ప్రారంభించవచ్చు. నెలవారీ ఆదాయ పథక ఖాతాకు పాస్బుక్ అందిస్తారు. ఈ ఖాతాను ఓ పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్కు బదలీ చేయవచ్చు.

పీవోఎంఐఎస్ ఖాతాను ముందుగా మూసివేస్తే
డిపాజిట్ చేసిన ఏడాది తర్వాత ఖాతాను మూసివేసి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఏడాది తర్వాత, మూడేళ్లకు ముందు ఖాతా మూసివేయాలనుకుంటే డిపాజిట్ మొత్తం సొమ్ము నుంచి రెండు శాతం కోత విధిస్తారు. మూడేళ్లు నిండి అయిదేళ్లు పూర్తి కాకపోతే డిపాజిట్ పైన ఒక శాతం కోత ఉంటుంది. పెట్టుబడి పెట్టిన రోజు నుంచి ఖాతాదారుకు నెలనెలా వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ పోస్టాఫీసు నుంచి నేరుగా తీసుకోవచ్చు లేదా మన పొదుపు ఖాతాలో లేదా బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకోవచ్చు. వడ్డీ సొమ్మును విత్ డ్రా చేసుకోకపోతే అదనంగా దానిపై వడ్డీ జమ అవదు. మెచ్యూరిటీ తీరాక మొత్తం డబ్బు చెల్లిస్తారు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications