వర్కింగ్ హవర్స్ 8 గం. నుండి 12 గం.: అదనపు శాలరీ ఇస్తేనే ఓవర్ టైమ్ లేదా సెలవు ఇవ్వాలి
ఉద్యోగుల ఓవర్ టైమ్ గురించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ప్యానెల్కు వివరణ ఇచ్చింది. అదనపు సమయానికి వేతనం చెల్లిస్తేనే ఉద్యోగులతో ఎనిమిది గంటలకు మించి పని చేయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చినట్లు పార్లమెంటరీ స్థాయి సంఘానికి తెలిపింది. అలాగే కార్మికులకు ఇష్టమైతేనే నాలుగు కార్మిక చట్టాలకు లోబడి అనుమతించినట్లు తెలిపింది.
పెరిగిన బంగారం ధరలు, వెండి రెండ్రోజుల్లో రూ.2,000 పెరుగుదల: పసిడి పరుగు తగ్గిందా?
ఓవర్ టైమ్కు వేతనం ఇస్తేనే..
కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపు తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది గంటలకు బదులు పన్నెండు గంటలకు వర్కింగ్ హవర్స్ పెంచాలని ప్రతిపాదించాయి. అయితే కార్మిక సంఘాలు సహా వివిధ వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కార్మిక చట్టాల ప్రకారం వర్కర్స్తో ఎనిమిది గంటలకు పైగా పని చేయించుకుంటే ఓవర్ టైమ్ చెల్లించాలని, అదనపు వేతనం చెల్లించకుండా ఎనిమిది గంటలకు మించి వర్కింగ్ హవర్స్ను పెంచలేదని కేంద్రంలోని ఉన్నతాధికారులు సోమవారం పార్లమెంటరీ ప్యానెల్కు సూచించారు.
వివరణ కోరుతూ లేఖలు..
కరోనా, లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో తాత్కాలికంగా మార్పులు, కార్మిక చట్టాలను విస్మరించడం, వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంపవర్మెంట్ శాఖ ఉన్నతాధికారులు బీజేడీ ఎంపీ భర్తృహరి మహ్తాబ్ అధ్యక్షతన గల కార్మిక, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నివేదించింది.
దాదాపు తొమ్మిది రాష్ట్రాలు పని గంటలను 8 గంటల నుండి 12 గంటలకు పెంచాలని కోరినట్లు తెలిపింది. ఆ తర్వాత విమర్శలు రావడంతో వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి దీనిపై వివరణ కోరుతూ లేబర్ పార్లమెంటరీ ప్యానెల్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. పని గంటలు ఎందుకు పెంచారో చెప్పాలని ప్రశ్నించింది.
అదనపు పని చేయించుకుంటే.. వేతనం లేదా సెలవులు
నాలుగు చట్టాల పరిధిలోనే పని గంటల్లో మార్పులు చేసుకునేందుకు అనుమతించామని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ కార్మిక సమితి (ILO)కు అనుబంధం కావడంతో ఎనిమిది గంటలకు మించి పని చేయించలేమని తెలిపింది. ఒకవేళ పెంచితే అందుకు కార్మికుల అనుమతి ఉండాలని, అదనపు సమయానికి వేతనం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. లేదా ఆ మేరకు సెలవులు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది.
వలస కార్మికుల దుస్థిత్పౌ..
లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల దుస్థితి గురించి కూడా ప్యానెల్ ప్రశ్నించింది. వలస కార్మికుల యొక్క నిర్వచనం పరిధిని విస్తృతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో సొంతగా కష్టం చేసుకునే హ్యాకర్లు, రిక్షా లాగేవారు, ఇతర స్వయం ఉపాధి కార్మికులను చేర్చాలని ప్యానెల్ సభ్యులు సూచించారు. అలాగే వీరు తమ సొంత రాష్ట్రాల్లో అర్హత కలిగిన అన్ని ప్రయోజనాలు పొందేలా చూడాలని తెలిపారు. ఈఎస్ఐ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాలు పొందే పరిస్థితుల్ని సులభతరం చేయాలని సూచించింది.