పెరుగుతున్న కరోనా కేసులతో ఇన్వెస్టర్ల అమ్మకాల బాట .. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
నిన్న మొన్నటి వరకు పుంజుకున్న స్టాక్ మార్కెట్లకు మళ్లీ ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో , కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తున్న పరిస్థితులు, వివిధ రాష్ట్రాలలో అక్కడక్కడా విధించిన లాక్ డౌన్ లు వెరసి స్టాక్ మార్కెట్లకు టెన్షన్ పట్టుకుంది. ఇదిలా ఉంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మీట్ ఫలితానికి ముందు ప్రపంచ పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యాపారం చేయడం మార్కెట్లపై ఊహించని ఒత్తిడిని కొనసాగించింది.
వేసవికి ముందే ఏసీల ధరలకు రెక్కలు: విక్రయాల్లో రెండంకెల వృద్ధిపై ధీమాలో తయారీ కంపెనీలు
నష్టాల్లోకి జారుకుంటున్న స్టాక్ మార్కెట్లు
దీంతో ఈ రోజు కూడా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజు నష్టాలను చవిచూశాయి . బిఎస్ఇ సెన్సెక్స్ 585 పాయింట్లు పడిపోయి 49,216 వద్ద ముగిసింది. ఇక నొప్పి 123 పాయింట్ పడిపోయి 14,557 కి చేరుకుందియుఎస్ ఫెడ్ సమావేశానికి ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా వర్తకం చేయడంతో పాటు, కోవిడ్ కేసులలో తిరిగి పుంజుకోవడంతో భారత మార్కెట్ ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది.
అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఇన్వెస్టర్లు, అమ్మకాల వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా లాక్డౌన్ విధిస్తూ పోతున్నారు. ఇక ఈ పరిస్థితులు మరింత పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం సైతం హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
మొన్నటి వరకు ఉత్సాహంగా పరుగులు తీసిన దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా నష్టాల్లోకి జారిపోతున్నాయి.
క్షీణిస్తున్న కీలక సూచీలు .. కరోనా భయమే కారణం ..
వరుసగా ఐదో రోజూ మార్కెట్లు బలహీనపడ్డాయి. దీనికి పెరుగుతున్న కరోనా మహమ్మారి కూడా ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది అన్న కారణాలతో మార్కెట్లో మళ్లీ ఒక్కసారిగా కుదుపులు మొదలయ్యాయి. కరోనామహమ్మారి విజృంభిస్తున్న అంచనాల మధ్య కీలక సూచీలు కుప్పకూలాయి. దాదాపు అన్ని రంగాలలోనూ అమ్మకాల ఒత్తిడి పెరిగింది . బేర్ గుప్పెట్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు చేరుకున్నాయి.