భారత నాలుగో ఐటీ సేవల సంస్థ విప్రో 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ (సెప్టెంబర్) ఫలితాలను మంగళవారం (13 అక్టోబర్) ప్రకటించింది. రెండో త్వైమాసికంలో విప్రో ఏకీకృత లాభం 3.2 శాతంగా నమోదయింది. ఏడాది ప్రాతిపదికన నికర లాభం 3 శాతం క్షీణించింది. విప్రో వరుసగా వృద్ధిని నమోదు చేస్తోంది. కరోనా నేపథ్యంలో మిగతా అన్ని రంగాలతో పోలిస్తే ఐటీ రంగం వృద్ధి ఆశాజనకంగా ఉంది. కంపెనీ రూ.9,500 కోట్ల షేర్ల బైబ్యాక్ను ప్రకటించింది. మూడో క్వార్టర్లో ఏకీకృత లాభం రూ.2,390.4 కోట్ల నుండి రూ.2,465.7 కోట్లకు పెరిగింది.

విప్రో లాభాలు
ఏకీకృత ఆదాయం 1.2 శాతం లాభపడి రూ.15,096.7 కోట్లకు పెరిగింది. క్వార్టర్ ప్రాతిపదికన డాలర్ రెవెన్యూలో వృద్ధి 3.7 శాతం పెరిగి 1,992.4 డాలర్లకు చేరింది. స్థిర కరెన్సీలో ఐటీ సేవల విభాగం ఆదాయం 2 శాతం పెరిగింది. క్వార్టర్లీ ప్రాతిపదికన మొదటి త్రైమాసికంలో 7.5 శాతం క్షీణించింది. విప్రో లాభాలు పలువురి అంచనాలు మించాయి. ఐటీ సేవల విభాగంలో రూపాయి ఆదాయం 1.2 శాతం పెరిగి రెండో క్వార్టర్లో రూ.14,768.1 కోట్లకు చేరింది.

తదుపరి క్వార్టర్లోను మంచి ఫలితాలు
రెవెన్యూ వృద్ధి, బలమైన నగదు నిల్వలతో ఈ క్వార్టర్ మంచి ఫలితాలు అందించిందని విప్రో విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు. ప్రస్తుత ఫలితాలు ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, రాబోయే క్వార్టర్లోను ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ సేవల బిజినెస్ నుండి రెవెన్యూ 2,022-2,062 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తోంది. ఇది వరుసగా 1.5 శాతం నుండి 3.5 శాతం మేర వృద్ధి నమోదు చేసినట్లు అవుతుంది.

విప్రో బైబ్యాక్
ఇటీవల టీసీఎస్ బైబ్యాక్ ప్లాన్ను ప్రకటించింది. విప్రో కూడా అదే దారిలో నడిచింది. రూ.9500 కోట్ల విలువైన బైబ్యాక్కు బోర్డు అంగీకారం తెలిపింది. రూ.400 వద్ద 23.75 కోట్ల షేర్లు బైబ్యాక్ చేయాలని నిర్ణయించింది. ఇది మొత్తం వ్యాల్యూలో 4.16 శాతం. విప్రో షేర్ ఈ రోజు 0.5 శాతం మేర నష్టపోయి రూ.375 వద్ద ముగిసింది. బైబ్యాక్ 6.6 శాతం ప్రీమియం లభిస్తుంది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications