Microsoft: కరోనా తరువాత భారతదేశంలోని అనేక టెక్ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. పైగా ఉద్యోగుల వలసల కారణంగా ఫ్రెషర్లను కూడా కంపెనీలు భారీ స్ఖాయిలో రిక్రూట్ మెంట్లు చేసుకుంటున్నాయి. కానీ.. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మాత్రం పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి మధ్య ఉద్యోగులను తొలగించింది. మాంద్యం కారణంగా ముందుగా ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ నిలిచింది.

కంపెనీ ప్రయోజనాలకోసమే..
టెక్ దిగ్గజం తన కార్యాలయాలు, ఉత్పత్తి విభాగాల్లో మెుత్తంగా 1,80,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో దాదాపు 1% మందిని తొలగించింది. అంటే 1,800 మంది వరకు ఉద్యోగులను కంపెనీ ప్రస్తుతం తొలగించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపు తక్కువగానే ఉందని, అన్ని కంపెనీలు లాగానే వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్మాణాత్మక సర్దుబాట్లు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కంపెనీ పెట్టుబడులు కొనసాగుతాయని, రానున్న సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఏఏ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి..
మైక్రోసాఫ్ట్ Q3లో బలమైన ఆదాయాలను నివేదించింది. క్లౌడ్ రాబడిలో 26% పెరుగుదల వల్ల మొత్తం ఆదాయం 49.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. జూన్ ప్రారంభంలో టెక్ దిగ్గజం దాని Q4 రాబడి అంచనాలను ఫారెక్స్ హెచ్చుతగ్గుల వల్ల తగ్గించుకుంది. అమెరికా ఆటో దిగ్గజం టెస్లా సైతం 200 మంది ఉద్యోగులను తొలగించింది. Twitter దాని రిక్రూటింగ్ టీమ్లో 30% మందికి ఉద్వాసన పలికింది.

కొత్త నియామకాల నిలిపివేత..
ఇదే క్రమంలో.. అమెరికాలోని టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్, స్నాప్, ఎన్విడియా, ఉబెర్, ఇంటెల్, సేల్స్ఫోర్స్ వంటి అనేక పాతుకుపోయిన సాంకేతిక సంస్థలు ఇటీవల కొత్త నియామకాలను తాక్కాలికంగా నిలిపివేశాయి. పెరుగుతున్న వడ్డీ రేట్లు, మాంద్యం, ప్రతిష్టంభన భయాలను రేకెత్తించడంతో టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపులు చేపట్టాయి. దీనికి తోడు కొత్త పెట్టుబడి ఆలోచనలను సైతం తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications