ఇప్పుడు ప్రపంచంలొ హాట్ టాఫిక్ అంశం ఏదైనా ఉందంటే అది AI గురించే. ప్రతి రంగంలోకి అది దూసుకుపోయి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉద్యోగులు అయితే భయం భయంగా కాలం గడుపుతున్నారు. చాలామంది ఇప్పటికే దారి బారీన పడి విలవిలలాడుతున్నారు. తాజాగా దీని మీద నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు N.R. Narayana Murthy మనీకంట్రోల్ తో మాట్లాడుతూ.. AI అనేది ఉద్యోగాలకు ముప్పు కాదు, అది తెలివైనవారికి ఒక శక్తివంతమైన సాధనమని చెప్పుకొచ్చారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని ఉదాహరణగా చెబుతూ.. జనరేటివ్ AI ఉపయోగించడం వల్ల పని నాణ్యత (quality), ఉత్పాదకత (productivity) గణనీయంగా పెరుగుతాయని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆలోచనాత్మకంగా పనిచేసే, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న యువతకు ఇది గొప్ప అవకాశమని స్పష్టం చేశారు. AI రావడంతో ప్రపంచం అంతం అవుతుందని అనుకోవడం తప్పని నారాయణ మూర్తి స్పష్టంగా చెప్పారు.

యువత ఈ టెక్నాలజీని భయపడకూడదు. దాన్ని అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, తమ పనిలో సహాయకంగా ఉపయోగించుకోవాలి. AI ని సరిగ్గా ఉపయోగిస్తే కొత్త ఆలోచనలు, కొత్త రంగాలు త్వరగా నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంటే, కష్టపడి పనిచేసే, తెలివైన వ్యక్తులకు AI ఒక శత్రువు కాదు, ఒక సహాయకుడు అని చెప్పుకొచ్చారు. ఇంతకుముందు కూడా నారాయణ మూర్తి సాంకేతిక మార్పులపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.
టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందని, అయితే ఈ మార్పుల మధ్య నిలకడగా ఉండే ఒక్క విషయం నేర్చుకునే సామర్థ్యం మాత్రమేనని ఆయన విశ్వసిస్తారు. ప్రతి ప్రొఫెషనల్ జీవితంలో నిరంతర అభ్యాసం (continuous learning) కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
AI మనం పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. మానవులు చేయడానికి రోజులు పట్టే పనులను AI కొన్ని నిమిషాల్లో పూర్తి చేయగలుగుతోంది. ఇదే కారణంగా కంపెనీలు AI సాధనాలను వేగంగా స్వీకరిస్తున్నాయి. దీనితో పాటు, AI నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులపై డిమాండ్ కూడా పెరుగుతోంది. అంటే AI ఉద్యోగాలను తొలగించడం కంటే, కొత్త రకమైన ఉద్యోగాలను సృష్టిస్తోంది.ఇది ఐటీ రంగానికే పరిమితం కాకుండా తయారీ, బ్యాంకింగ్, ఆరోగ్యం, విద్య, మీడియా వంటి అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్లో కూడా నిపుణులు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. AI ను ఎలా ఉపయోగిస్తామన్నదే అసలు కీలకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి Narendra Modi కూడా మాట్లాడుతూ, AI ప్రయోజనాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలని, యువత దీనిని నేర్చుకుని దేశ అభివృద్ధికి ఉపయోగించాలని ఆయన సూచించారు.
More From GoodReturns

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

Layoffs: ఒరాకిల్లో భారీ లేఆఫ్స్.. 30 వేల మందిపై వేటు? అసలు కారణం ఇదేనా?

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

పెంటగాన్ డీల్ ఎఫెక్ట్.. ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు! అసలేం జరిగింది?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications
