ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు తీసుకువచ్చేందుకు కొన్ని నిబంధనలను మార్చే అవకాశాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిశీలిస్తోంది. ఎక్కువమంది ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈపీఎఫ్ఓ శుభవార్త అందించనుందని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ ద్వారా 6 కోట్ల మంది ఉద్యోగులు ప్రయోజనాలు పొందుతున్నారు. అదనంగా 50 లక్షల మందికి సామాజిక భద్రత కల్పించాలని ఈఫీఎఫ్ఓ భావిస్తోంది. ఈ ఉద్యోగులకు ఇప్పటివరకు పీఎఫ్ కట్ ఉండదు. వారికి కూడా జనవరి 1 నుంచి పీఎఫ్ కావొచ్చు.

వీరికీ సోషల్ సెక్యూరిటీ
ప్రస్తుత EPF నిబంధనల ప్రకారం 20 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలు వర్తిస్తాయి. ఈపీఎఫ్ యాక్ట్ కింద అలాంటి సంస్థలకు ఈపీఎఫ్ మెంబర్షిప్ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం దీనిని 10 మంది ఉద్యోగులకు తగ్గిస్తోందని వార్తలు వస్తున్నాయి. వీరికి కూడా సోషల్ సెక్యూరిటీ ఉండాలని భావిస్తోంది. దీంతో 10 మంది అంతకంటే ఎక్కువ ఉద్యోగులు కలిగిన కంపెనీ కూడా ఈపీఎఫ్కు దరఖాస్తు చేసుకోవచ్చు.

త్వరలో అమల్లోకి...!
10 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు కలిగిన సంస్థలు EPF పరిధిలోని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిబంధనల చట్టం కింద తాము నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం మాత్రం 20 మంది అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు మాత్రమే ఈ పరిధిలోకి వస్తాయి.

జనవరి నుంచి అమలు..
2008 జూలైలోనే 183వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు అప్రూవల్ వచ్చింది. దీనిని అమలు చేయాల్సి ఉంది. తాజాగా, కేంద్ర కార్మిక శాఖకు కొత్త రూల్ అమలుకు ఆమోదం లభించినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ అంశానికి సంబంధించి కార్మిక శాఖ నోటిఫికేషన్ ఇచ్చిందని, దీనికి పార్లమెంటు అప్రూవల్ అవసరం లేదని అంటున్నారు. వీటిని జనవరి 1, 2020 నుంచి అమలు చేయవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications